Karthikeya 2: ప్రస్తుత కాలంలో ఒక సినిమా హిట్ అయింది అంటే దానికి సీక్వెల్ చిత్రం రావడం గమనార్హం. ఈ క్రమంలోనే 2014లో చందు మొండిటి దర్శకత్వంలో నిఖిల్ కలర్స్ స్వాతి జంటగా నటించిన చిత్రం కార్తికేయ. ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది ఈ క్రమంలోనే ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా కార్తికేయ 2 సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఇప్పటికే సినిమా షూటింగ్ పనులన్నిటిని పూర్తి చేసుకొని ఈనెల 13వ తేదీ ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ సినిమాలో నిఖిల్ సరసన కలర్స్ స్వాతి కాకుండా ఆమె స్థానంలోకి అనుపమ పరమేశ్వరన్ వచ్చారు.ఇలా అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో నటించడానికి గల కారణం ఏంటి అని పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తం చేశారు.కార్తికేయ సినిమాలో నటించిన కలర్ స్వాతిని కావాలని పక్కన పెట్టి ఆమె స్థానంలో ఈమెను తీసుకున్నారా అనే సందేహం కూడా వ్యక్తం చేశారు.
తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్న హీరో నిఖిల్ కి సైతం ఇదే ప్రశ్న ఎదురైంది. ఈ క్రమంలోనే కలర్స్ స్వాతి స్థానంలో అనుపమ పరమేశ్వరన్ ను ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ఈయన క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ కార్తికేయ సినిమాలో కలర్స్ స్వాతి నటన ఎంతో అద్భుతంగా ఉంది అయితే ఈ సినిమాలో ఆమెను తీసుకోకపోవడానికి ఒక కారణం ఉందనీ తెలిపారు.
ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర నార్త్ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి లుక్ కనిపించాల్సి ఉంటుంది. ఇక కలర్స్ స్వాతి అచ్చు తెలుగు అమ్మాయిలా ఉండటం వల్ల తనని ఈ పాత్ర నుంచి తప్పించి ఆమె స్థానంలో అనుపమ పరమేశ్వరన్ ను తీసుకున్నట్లు ఈ సందర్భంగా నిఖిల్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈయన హీరోయిన్ గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఈ సినిమా ఆగస్టు 13వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది.
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…
దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో దగ్గు సిరప్ల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దగ్గు మందులు లేదా…
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ (NEET) పరీక్ష చుట్టూ గత కొంతకాలంగా వివాదాలు, పేపర్ లీక్…