Kasturi Shankar: బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి పూనం పాండే ఇటీవల పెద్ద ఎత్తున వార్తలలో నిలిచిన సంగతి మనకు తెలిసిందే. ఈమె సోషల్ మీడియా వేదికగా మరణించినట్టు ఒక పోస్ట్ చేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. గర్భాశయ క్యాన్సర్ తో తాను మరణించానని ఈమె పోస్ట్ చేశారు.
ఇలా ఈమె మరణ వార్త నిజమేనని భావించి ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ఈమెకు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. ఇలా ఈమె వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి తరుణంలో తాను చనిపోలేదని బ్రతికే ఉన్నానని అయితే అందరికీ ఈ సర్వైకల్ క్యాన్సర్ పట్ల అవగాహన తీసుకురావడం కోసమే ఇలా చేశాను అంటూ చెప్పుకోవచ్చారు.
ఇక ఈ విషయంపై ఎంతో మంది సినీ సెలెబ్రెటీలు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా మరికొందరు ఈమెపై చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్లు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయినటువంటి కస్తూరి శంకర్ కూడా ఈ విషయంపై స్పందించారు. పూనం తన వయసు 32 సంవత్సరాలు అని తెలిసినప్పుడే ఇది పబ్లిసిటీ స్టంట్ అనే విషయం నాకు అర్థం అయింది ఈమె కేవలం పాపులారిటీ కోసమే ఇలాంటి పోస్ట్ చేశారంటూ కస్తూరి శంకర్ తెలిపారు.
పబ్లిసిటీ కోసమే…
అది ఫేక్ న్యూస్ అని.. కేవలం పబ్లిసిటి స్టంట్ అని.. ఎందుకంటే ప్రజలకు సర్వైకల్ క్యానర్ గురించి పూర్తిగా తెలుసు. దానికి కారణంగా ఏం జరుగుతుంది అనేది తెలుసు. పూనమ్ కేవలం ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు అలా చేసిందని తెలిసింది. కానీ క్యాన్సర్ జబ్బును ఇలా పబ్లిసిటి స్టంట్ కోసం ఉపయోగించడం నిజంగా సిగ్గుచేటు అంటూ కస్తూరి శంకర్ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…