కరోనా మహమ్మారి రోజురోజుకీ తన పంజా విసురుతుండటంతో దేశం మొత్తం భయం గుప్పట్లో వణికిపోతుంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఇదిలావుండగా కరోనా వైరస్ ఫలానా సెలబ్రిటీకి సోకిందంటూ ఈమధ్య సోషల్ మీడియాలో రోజుకో రూమర్ పుట్టుకొస్తుంది. మొన్నటికి మొన్న ప్రముఖ టీవి యాంకర్ ఓంకార్ కి కరోనా సోకినదంటూ ఒక గాసిప్ మీడియాలో షికారు చేసింది.
దాంతో అలాంటిదేమీ లేదని ఆయన “తనకి కరోనా సోకలేదని.. ఇదంతా పుకారు మాత్రమేనని” చెప్పారు. తాజాగా ఈ మహమ్మారి బారిన కత్తి మహేష్ కూడా పడ్డట్టు రూమర్స్ వస్తున్నాయి. ప్రముఖ మీడియా సంస్థలో ఒక షో నిర్వాహకుడిగా పనిచేస్తున్న కత్తి మహేష్ కు కరోనా సోకడంతో సదరు ఛానల్లోని ఉద్యోగులు భయపడిపోతున్నారంటూ గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. ఈ రూమర్లకు ఫుల్ స్టాప్ పెడుతూ కత్తి మహేష్ స్పందించారు. తనకి కరోనా సోకలేదని.. ఇదంతా రూమరని.. సెలబ్రిటీలపై లేనిపోని రూమర్లు పుట్టించి ఆనందపడటం శునకానందమని.. ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నవాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…