బాలీవుడ్ ప్రేమపక్షులుగా ఉన్నటువంటి కత్రినాకైఫ్, విక్కీ కౌశల్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని పెద్దఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వీరి పెళ్లి గురించి ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ వీరి పెళ్లి ఏర్పాట్లు మాత్రం ముమ్మరంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కత్రినాకైఫ్ విక్కీ కౌశల్ పెళ్లి కోసం రాజస్థాన్ సవాయ్ మధోపూర్ లోని బర్వారాలో పోర్టు కమ్ రిసార్ట్లో జరుగనున్నట్లు సమాచారం.
ఇండియా టుడే కథనం ప్రకారం వీరి పెళ్ళికి వచ్చే అతిథులకు ఏ విధమైనటువంటి మొబైల్ ఫోన్స్ అనుమతి లేకుండా ఉండడం కోసం ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇక ఇప్పటికే కత్రినాకైఫ్ వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయని తెలుస్తుంది.ఇందులో భాగంగానే మెహందీ ఫంక్షన్ కోసం అన్ని ఏర్పాట్లు జరిగాయని అయితే ఈ మెహందీ ఫంక్షన్ ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.
తన పెళ్లి కోసం కత్రినాకైఫ్ ఏకంగా మెహందీ వేయడానికి రాజస్థాన్ నుంచి జోధ్పూర్లోని పాలి జిల్లా నుంచి సోజత్ మెహందీ తెప్పించారట. ఈ సందర్భంగా మెహందీ వ్యాపారి సోజత్ మాట్లాడుతూ కత్రినాకైఫ్ మెహందీ తయారు చేయడం కోసమే సుమారు 50 నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుందని వెల్లడించారు.
ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రతి ఒక్కరు ఎంతో ఆశ్చర్యపోతున్నారు. కేవలం మెహందీ కోసమే కత్రినాకైఫ్ ఈ రేంజ్ లో ఖర్చు చేస్తున్నారు అంటే ఇక పెళ్లి ఏర్పాట్లు ఎలా ఉంటాయి అంటూ పలువురు సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.
ఇటీవల కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. పాతకాలం నుంచి వాడుతున్న మొక్కలు, వనమూలికలపై మళ్లీ ఆసక్తి పెరిగింది. అలాంటి వాటిలో…
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…