Kavya Kalyan Ram: హీరో శ్రీ సింహ కోడూరి కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ఉస్తాద్. ఈ సినిమాలో శ్రీ సింహ కావ్యా కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా నటించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆగస్టు 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి కావ్య కళ్యాణ్ రామ్ ఈ సినిమా గురించి ఎన్నో విశేషాలను అభిమానులతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా కావ్య కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ఉస్తాద్ సినిమాకథపై మాకు ఎంతో నమ్మకం ఉంది. ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని ఈమె ఆశాభావం వ్యక్తం చేశారు .ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పలు కాలేజీలకు వెళ్ళగా అక్కడ మాకు భారీ స్థాయిలో స్పందన లభించిందని తెలియజేశారు. ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తెలుగు హీరోయిన్స్ గురించి కావ్య మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేశారు. తెలుగు వారికి హీరోయిన్గా అవకాశాలు రాలేదన్న వార్త ఇండస్ట్రీలో తరచూ వినపడుతూనే ఉంటుంది.
ఇలా తెలుగు వారికి సినిమా అవకాశాలు ఉండవు అనే విషయం గురించి తాజాగా కావ్య కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ…ఇలా తెలుగువారికి హీరోయిన్గా అవకాశాలు రావడంలేదని ఎందుకు అంటున్నారో నాకైతే అర్థం కాలేదని తెలిపారు.ఎందుకంటే సావిత్రి శ్రీదేవి వంటి ఎంతో గొప్ప నటీమణులు కూడా తెలుగు వారే ఇండియాలో ఇప్పటికీ వీరికన్నా అద్భుతంగా నటించిన, వీరికన్నా అద్భుతమైన సక్సెస్ చూసినటువంటి నటీమణులు లేరు.
ఇక నా విషయానికి వస్తే నేను తెలుగు అమ్మాయి కావడం నా అదృష్టం. నేను చేసిన మూడు సినిమాలలోని దర్శకులు కూడా తెలుగు అమ్మాయి అయితే బాగుంటుందని ఆ సినిమాలకు నన్ను ఎంపిక చేశారు. భాష వస్తే చాలు అవకాశం వస్తుందనుకోవడం పొరపాటు.నటీనటులు ఎప్పుడూ కూడా ఒకే భాషకు పరిమితం కాకూడదు అంటూ ఈ సందర్భంగా కావ్య కళ్యాణ్ రామ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…