Keerthy Suresh: వెండితెరపై నటిగా కొనసాగుతూ గ్లామర్ షో కి కాస్త దూరంగా ఉంటూ విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుని ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి వారిలో కీర్తి సురేష్ ఒకరు.సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్ ఇండస్ట్రీలో తన కంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగులో నేను శైలజ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈమె అనంతరం పలు సినిమాల ద్వారా తెలుగులో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.
ఇక ప్రస్తుతం ఈమె నాని హీరోగా నటించిన దసరా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా మార్చి 30 తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక కీర్తి సురేష్ తెలుగుతో పాటు తమిళ సినిమాలతో కూడా ఎంతో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే.
ఇలా ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతూ ఉన్నటువంటి కీర్తి సురేష్ కెరియర్ మొదట్లో ఒక్కో సినిమాకి 40 నుంచి 70 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకి మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇలా ఈమె ఇండస్ట్రీలో కొనసాగుతూనే భారీగా ఆస్తులను కూడా పెట్టారని తెలుస్తుంది.ఇండస్ట్రీ సమాచారం ప్రకారం ఈమె దాదాపు 35 నుంచి 40 కోట్ల రూపాయల వరకు ఆస్తులను కూడా పెట్టినట్టు సమాచారం.
వీటితోపాటు చెన్నైలోనూ అలాగే హైదరాబాద్లోనూ ఖరీదైన బంగ్లాలు కూడా కొనుగోలు చేశారట. అలాగే కోట్ల విలువచేసే ఖరీదైన కార్లు కూడా ఈమె గ్యారేజ్ లో ఉన్నాయని తెలుస్తుంది.ఇలా ఒక్కో సినిమాకు మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుని కీర్తి సురేష్ పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తూ డబ్బును సంపాదిస్తున్నారు. రిలయన్స్ ట్రెండ్స్, జోస్ అలుక్కాస్ వంటి సంస్థలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు ఒక్కో యాడ్ కోసం ఈమె 15 నుంచి 30 లక్షల వరకు రెమ్యూనరేషన్ అనుకోవడం విశేషం.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…