2020 సంవత్సరం దేశ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. వైరస్ లు, బ్యాక్టీరియాలు ప్రజలకు కొత్త కష్టాలను సృష్టిస్తున్నాయి. ఒక వ్యాధి అదుపులోకి వచ్చిందని అనుకునే లోపు మరో కొత్త వ్యాధి విజృంభిస్తోంది. దేశంలో 10 నెలలు గడిచినా కరోనా మహమ్మారి ఇప్పటికీ అదుపులోకి రాలేదు. అమెరికాలో కరోనా వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చినా వైరస్ పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో వ్యాక్సిన్ వచ్చినా కరోనాను కట్టడి చేయలేమా..? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
ఇదే సమయంలో కొత్త వైరస్ లు, బ్యాక్టీరియాలు వెలుగులోకి వస్తూ ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి. కేరళలోని కోజికోడ్ లో షిగెల్లా అనే బ్యాక్టీరియా వల్ల 11 సంవత్సరాల బాలుడు మృతి చెందారు. ఇది ఒకరి నుంచి ఒకరికి సోకే వ్యాధి కావడంతో ఆ బాలుడితో సన్నిహితంగా మెలిగిన వారిలో సైతం షిగెల్లా లక్షణాలు కనిపిస్తున్నాయి. బాలుడి స్నేహితులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ బ్యాక్టీరియా వేగంగా వ్యాప్తి చెందితే మాత్రం కరోనా కంటే ప్రమాద పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కడుపులో తిప్పడం, జ్వరం, అతిసారం లాంటి లక్షణాలు ఈ వ్యాధి బారిన పడిన వారిలో ఎక్కువగా కనిపిస్తాయి. కేరళలో ఈ వ్యాధి బారిన పడి 20 మంది ఆస్పత్రులలో చేరారు. అయితే వైద్యులు మాత్రం ఈ బ్యాక్టీరియా కొత్తది కాదని చాలా సంవత్సరాల క్రితమే దీనిని గుర్తించారని చెబుతున్నారు.
గతేడాది ఒక పాఠశాలలో 40 మంది విద్యార్థులలో షిగెల్లా వ్యాధి లక్షణాలు కనిపించగా వీరిలో ఇద్దరికి షిగెల్లా నిర్ధారణ అయింది. కొందరు ఈ బ్యాక్టీరియా బారిన పడినా ఎలాంటి లక్షణాలు కనిపించవని అయితే షిగెల్లా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి వ్యాధి నిర్ధారణతో పాటు చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…