దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేసి కరోనా మహమ్మారిని కట్టడి చేశాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ నిబంధనలలో సడలింపు ఇచ్చారు. ఈ క్రమంలోనే కేవలం రాత్రి సమయంలో మాత్రమే కర్ఫ్యూ అమలులో ఉంది. అయితే కేరళ రాష్ట్రంలో మాత్రం మరోసారి లాక్ డౌన్ అమలు చేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు పాజిటివ్ రేటు 10% ఉండటంతో కరుణ కేసులను కట్టడి చేయడానికి అక్కడి ప్రభుత్వం మరికొన్ని రోజులపాటు లాక్ డౌన్ కొనసాగించాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 24, 25 వ తేదీలలో సంపూర్ణ లాక్డౌన్ విధించాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.
ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షలకు పైగా కరోనా పరీక్షలను నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కేరళ రాష్ట్రంలోని అన్ని జిల్లాలను మైక్రో కంటెంట్ జోన్లుగా విభజించాలని వీలయినంత వరకు కొత్త కేసులు నమోదు కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కేరళ ముఖ్యమంత్రి తెలిపారు. ఈ క్రమంలోనే లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు లేదని, వారాంతంలో కఠిన నిబంధనలతో లాక్ డౌన్ అమలు చేయాలని కేరళ ముఖ్యమంత్రి ఆదేశించారు
కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…