దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేసి కరోనా మహమ్మారిని కట్టడి చేశాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ నిబంధనలలో సడలింపు ఇచ్చారు. ఈ క్రమంలోనే కేవలం రాత్రి సమయంలో మాత్రమే కర్ఫ్యూ అమలులో ఉంది. అయితే కేరళ రాష్ట్రంలో మాత్రం మరోసారి లాక్ డౌన్ అమలు చేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు పాజిటివ్ రేటు 10% ఉండటంతో కరుణ కేసులను కట్టడి చేయడానికి అక్కడి ప్రభుత్వం మరికొన్ని రోజులపాటు లాక్ డౌన్ కొనసాగించాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 24, 25 వ తేదీలలో సంపూర్ణ లాక్డౌన్ విధించాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.
ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షలకు పైగా కరోనా పరీక్షలను నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కేరళ రాష్ట్రంలోని అన్ని జిల్లాలను మైక్రో కంటెంట్ జోన్లుగా విభజించాలని వీలయినంత వరకు కొత్త కేసులు నమోదు కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కేరళ ముఖ్యమంత్రి తెలిపారు. ఈ క్రమంలోనే లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు లేదని, వారాంతంలో కఠిన నిబంధనలతో లాక్ డౌన్ అమలు చేయాలని కేరళ ముఖ్యమంత్రి ఆదేశించారు
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…