Kiara Advani: బాలీవుడ్ నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే ఈమె తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితమే మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అనంతరం రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమాలో కూడా నటించారు.
ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లిపోయారు. అక్కడ సూపర్ సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ప్రస్తుతం రామ్ చరణ్ శాసనం గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తున్నారు.ఇలా ఇండస్ట్రీలోనే కొనసాగుతూ స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె బాలీవుడ్ నటుడు సిద్ధార్థ మల్హోత్రాను వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.
ఈ విధంగా ఈమె బాలీవుడ్ నటుడు సిద్ధార్థ మల్హోత్రను పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె ప్రెగ్నెంట్ అంటూ తరచు తన గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. అందుకే తనకు ఇష్టమైన ఫుడ్ తింటున్నారని తనకు ఈ ఫుడ్డే తినాలని కోరికలు కూడా కలుగుతున్నాయి అంటూ తన గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై స్పందించినటువంటి ఈమె క్లారిటీ ఇచ్చారు.
ఈమె ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతూ తనకు ప్రెగ్నెంట్ అవ్వాలని కోరికగా ఉందని తెలిపారు.ప్రెగ్నెంట్ అయితే మనం మనకు నచ్చిన ఫుడ్ తినొచ్చు ఎవరు కూడా అడ్డు చెప్పరని తెలిపారు. అదే విధంగా తనకు పిల్లలు పుడితే ఆడ మగ అని బేధాలు ఏమి చూపించను అంటూ ఈమె ప్రెగ్నెన్సీ గురించి తన పిల్లలకు గురించి చెబుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బహుశా ఈ కామెంట్ చేయడంతో త్వరలోనే ఈమె గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…
ఐపీఎల్ 2026 సీజన్లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్కు…
అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…
ప్రముఖ నటుడు Sonu Sood తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానంను సందర్శించారు. స్వామివారి దర్శనం కోసం…