Kiccha Sudeep: గత ఆరు సంవత్సరాల క్రితం కన్నడ చిత్ర పరిశ్రమలో తెరకెక్కిన కిరిక్ పార్టీ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటి రష్మిక మందన్న. ఈమె ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా మారిపోయారు.ఇక సెలబ్రిటీలు అన్న తర్వాత వారికి ఎలాంటి స్టార్డం ఉంటుందో అదే స్థాయిలో వారిని ట్రోల్ చేసే వారు కూడా ఉంటారనే సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే రష్మిక సైతం ప్రస్తుతం ఇలాంటి ట్రోలింగ్స్ ఎదుర్కొంటుంది. రష్మిక కన్నడ దర్శకుడు హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతార సినిమా చూసే సమయం తనకు లేదని చెప్పిన సమాధానమే ఇలాంటి వివాదాలకు కారణమైందని చెప్పాలి.కాంతార సినిమా ఇంకా తాను చూడలేదని చెప్పడంతో నీకు లైఫ్ ఇచ్చిన హీరో సినిమా దేశవ్యాప్తంగా చూస్తూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తుంటే నీకు తన సినిమా చూసే అవకాశం లేదా అంటూ నేటిజన్స్ భారీగా ట్రోల్ చేస్తున్నారు.
ఇలా ఈ విషయం ద్వారా వివాదాలను ఎదుర్కొంటున్న రష్మిక గురించి తాజాగా మరొక కన్నడ హీరో సుదీప్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెలబ్రిటీలన్న తర్వాత వారి గురించి ట్రోలింగ్స్ రావడం సర్వసాధారణం.సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ప్రతి చిన్న విషయం కూడా అందరికీ తెలిసిపోతుంది అయితే గతంలో కేవలం ఇంటర్వ్యూల ద్వారా మాత్రమే తెలుసుకునేవారు.
అంతకుముందు కేవలం వార్తాపత్రికల ద్వారా మాత్రమే సెలబ్రిటీల గురించి తెలుసుకునేవారు.అయితే ప్రస్తుతం ప్రతి ఒక్క విషయం కూడా అభిమానులకు తెలిసిపోతుంది. అయితే వాళ్లు ఎలాంటి వార్తలు రాసిన మనం ఎలా హ్యాండిల్ చేయాలి అనేది తెలుసుకోవాలి కానీ అక్కడే ఆగిపోకూడదు. ఒక్కసారి సెలబ్రిటీ స్టేటస్ వచ్చిందంటే నీకు పూలమాలలు వేసి సత్కరిస్తారు. అదే చేతితో టమోటాలు రాళ్లు కూడా వేస్తారంటూ ఈయన తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…