ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ నెల 24వ తేదీ తీవ్రమైన అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు అతనిని సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. అతను ఆస్పత్రిలో చేరిన రెండు రోజులకు ఈ విషయాన్ని వెల్లడించడంతో ఒక్కసారిగా సినీ ప్రముఖులు అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అభిమానులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో కిమ్స్ వైద్యులు సోమవారం ఆయన హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కిమ్స్ వైద్యులు మాట్లాడుతూ సిరివెన్నెల సీతారామశాస్త్రి న్యూమోనియాతో బాధపడుతున్నారు. దీంతో ఆయనకు మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం ఆయన ఐసియులోనే ఉన్నారని అతను కోలుకోవడానికి నిత్యం తనను పరిశీలిస్తూ మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నట్లు వైద్యులు ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి కొంత వరకు మాత్రమే కుదుటపడిందని ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని తెలిపారు.
ఉన్నపళంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ విధంగా ఆసుపత్రి పాలవడంతో ఎంతో మంది అభిమానులు సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తూ అతను క్షేమంగా ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు. ఆదివారం ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన సినీ పరిశ్రమ ఇప్పుడు సీతారామ శాస్త్రి ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…