ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ నెల 24వ తేదీ తీవ్రమైన అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు అతనిని సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. అతను ఆస్పత్రిలో చేరిన రెండు రోజులకు ఈ విషయాన్ని వెల్లడించడంతో ఒక్కసారిగా సినీ ప్రముఖులు అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అభిమానులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో కిమ్స్ వైద్యులు సోమవారం ఆయన హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కిమ్స్ వైద్యులు మాట్లాడుతూ సిరివెన్నెల సీతారామశాస్త్రి న్యూమోనియాతో బాధపడుతున్నారు. దీంతో ఆయనకు మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం ఆయన ఐసియులోనే ఉన్నారని అతను కోలుకోవడానికి నిత్యం తనను పరిశీలిస్తూ మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నట్లు వైద్యులు ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి కొంత వరకు మాత్రమే కుదుటపడిందని ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని తెలిపారు.
ఉన్నపళంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ విధంగా ఆసుపత్రి పాలవడంతో ఎంతో మంది అభిమానులు సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తూ అతను క్షేమంగా ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు. ఆదివారం ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన సినీ పరిశ్రమ ఇప్పుడు సీతారామ శాస్త్రి ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…