Drinking water:మన శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగాలంటే మన శరీరానికి సరిపడా నీరు ఎంతో అవసరం అనే విషయం మనకు తెలిసిందే. అందుకే అధిక మొత్తంలో నీటిని తీసుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు కూడా చెబుతున్నారు. ఇకపోతే మనం ఏదైనా ఆహార పదార్థాలను తిన్న వెంటనే ప్రతి ఒక్కరికి నీళ్లు తాగడం అలవాటుగా ఉంటుంది.కానీ కొన్ని ఆహార పదార్థాలను తిన్న తర్వాత పొరపాటున కూడా నీళ్లు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు.
చాలామంది భోజనం చేసిన వెంటనే గబగబా నీళ్లు తాగుతారు.కానీ భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగడం వల్ల మనం తీసుకున్న ఆహారం జీర్ణం కాక జీర్ణక్రియ సమస్యలు ఏర్పడతాయి అందుకే భోజనం చేసిన అరగంట తర్వాత నీళ్లు తాగడం ఎంతో ఉత్తమం. అదేవిధంగా నీళ్లు కలిగిన పండ్లను తిన్న తర్వాత తిరిగి నీటిని తాగకూడదు.
ఇలా వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ దెబ్బ తినడంతో పాటు ఆహారం జీర్ణం కాకుండా ఉంటుంది. తద్వారా జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. ఇక నీళ్ళు కలిగిన పుచ్చకాయ, కీరదోస, నారింజ వంటి పండ్లను తిన్న తర్వాత కూడా నీళ్లు తాగకూడదు అని నిపుణులు చెబుతున్నారు.
ఆయుర్వేదం ప్రకారం మనం తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల అది జీర్ణక్రియ వ్యవస్థను నాశనం చేయడమే కాకుండా ఊబకాయానికి దారితీస్తుందని చెప్పవచ్చు.ఇక పళ్ళలో అధిక శాతం నీటిని కలిగి ఉండి అలాంటి పండ్లను తిన్న తర్వాత తిరిగి నీటిని తాగడం వల్ల డయేరియా వచ్చే ప్రమాదం ఉంది.అదేవిధంగా చెరుకు తిన్న తరువాత నీటిని తాగకూడదు చెరువులో క్యాల్షియం పొటాషియం అధికంగా ఉండటం వల్ల వెంటనే నీటిని తాగటం వల్ల మన నోటిలో పగుళ్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…
ఐపీఎల్ 2026 సీజన్లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్కు…
అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…