Health News

Covid Vaccination: ఇకపై కరోనా వ్యాక్సిన్ కు వారందరూ కూడా అర్హులే.. కీలక ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం!

Covid Vaccination: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తమై ముందస్తు జాగ్రత్త చర్యలు పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే నైట్ కర్ఫ్యూ, వారాంతపు లాక్ డౌన్ అమలు చేస్తూ ఈ మహమ్మారి కట్టడికి కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఈ వైరస్ బారిన పడిన ఏ విధమైనటువంటి ప్రమాదం లేకుండా ఉండటం కోసం ఇప్పటికే రెండు డోస్ ల వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న వారు బూస్టర్ డోస్ వేసుకోవడానికి కూడా అర్హులు అని ప్రకటించారు.

ఇలా 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ కూడా ఇప్పటికే రెండు డోసులు వ్యాక్సిన్ అందించారు.ఈ క్రమంలోనే 2022 జనవరి నాటికి 15 సంవత్సరాలు పూర్తి నిండిన ప్రతి ఒక్కరికి కూడా కరోనా వ్యాక్సిన్ వేయాలని వీరు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులని కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వులు వెల్లడించారు.

ఈ క్రమంలోనే 15 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసున్న వారందరూ కూడా కరోనా వ్యాక్సిన్ వేయించుకునేలా చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది.

ఈ సంవత్సరాలలో పుట్టిన వారు కూడా అర్హులే…

2005, 2006, 2007 సంవత్సరంలో జన్మించిన వారందరూ కూడా ఈ కేటగిరీ కిందికి వస్తారని, వారు కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక ఇప్పటికే 15 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసున్న వారికి 59% మొదటి డోస్ వ్యాక్సిన్ పూర్తిచేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

‘పసివాడి ప్రాణం’ నటుడు బాబు ఆంటోనీ లైఫ్ ఇలా మారిపోయింది!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…

1 day ago

చూపు లేకపోయినా సంగీతంతో ప్రపంచాన్ని గెలిచిన వైకమ్ విజయలక్ష్మి!

చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…

1 day ago

కురుక్షేత్ర యుద్ధానికి దూరంగా నిలిచిన మహా యోధులు వీరే..!

మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…

1 day ago

కొత్త దంపతులు ముత్యాలు ధరిస్తే ఇంత మార్పా..? ముత్యాలపై నిపుణుల విశ్వాసం ఇదే!

భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…

1 day ago

ఒకే రాశి వాళ్లు పెళ్లి చేసుకుంటే జీవితం ఎలా ఉంటుంది..? తెలుసుకుంటే ఆశ్చర్యమే!

వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…

1 day ago

ఇంట్లో ఈ మొక్క ఉంటే చాలు అంటున్న వాస్తు నిపుణులు.. లక్ష్మీ కటాక్షం కలుగుతుందట!

హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…

1 day ago