వేసవి కాలం వచ్చిందంటే చాలామంది ఇళ్లలో మామిడి పండ్ల సందడి మొదలవుతుంది. ముఖ్యంగా పెరుగన్నంలో మామిడి ముక్కలు కలిపి తినడం చాలామందికి ఎంతో ఇష్టమైన కాంబినేషన్. రుచికి అద్భుతంగా అనిపించే ఈ ఫుడ్ కాంబోపై ఇప్పుడు ఆరోగ్య నిపుణులు కొన్ని కీలక సూచనలు చేస్తున్నారు. రుచిగా ఉందని తరచూ ఇలా తినడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.
ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం, మామిడి పండు శరీరంలో వేడి స్వభావాన్ని పెంచే లక్షణం కలిగి ఉంటుంది. మరోవైపు పెరుగు శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. ఈ రెండు విభిన్న గుణాలున్న ఆహారాలను ఒకేసారి తీసుకుంటే జీర్ణక్రియపై ప్రభావం పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారిలో కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు ఎక్కువగా కనిపించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
కొంతమందిలో ఈ కాంబినేషన్ కారణంగా కడుపులో మంట, వికారం, అలసట వంటి ఇబ్బందులు కూడా తలెత్తవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే చర్మంపై దద్దుర్లు లేదా అలర్జీ లక్షణాలు కనిపించే అవకాశమూ ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే మామిడి పండును విడిగా, పెరుగును విడిగా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
మామిడి తిన్న వెంటనే నీళ్లు తాగడం కూడా మంచిది కాదని కొందరు వైద్యులు సూచిస్తున్నారు. వెంటనే నీళ్లు తాగితే జీర్ణక్రియ మందగించి ఎసిడిటీ లేదా కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కనీసం 20 నుంచి 30 నిమిషాల గ్యాప్ ఇచ్చిన తర్వాతే నీళ్లు తీసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు.
ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే మార్కెట్లో లభించే కొన్ని మామిడి పండ్లను త్వరగా పండించేందుకు రసాయనాలు ఉపయోగించే అవకాశముంటుంది. ముఖ్యంగా కాల్షియం కార్బైడ్ వంటి పదార్థాలతో పండించిన పండ్లు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే మామిడి కొనుగోలు చేసే సమయంలో సహజంగా పండిన పండ్లను ఎంచుకోవాలని సూచిస్తున్నారు.
అయితే ప్రతి ఒక్కరి శరీర తత్వం వేరు. కొందరికి ఈ కాంబినేషన్ ఎలాంటి ఇబ్బందులు కలిగించకపోయినా, మరికొందరికి సమస్యలు రావచ్చు. కాబట్టి శరీరం ఎలా స్పందిస్తుందో గమనిస్తూ ఆహార అలవాట్లు మార్చుకోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…