లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పలు టాక్ షోలతో బిజీ బిజీ గా లాక్ డౌన్ పిరియడ్ ను గడిపేస్తున్నాడు. అయితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో లైవ్ విత్ సునీల్ ఛెత్రి టాక్ షోలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో తన కెరియర్ మొదటిలో రాష్ట్ర క్రికెట్ జట్టుకు ఎంపిక అవడంకోసం తన తండ్రిని కొందరు సెలక్టర్లు లంచం అడిగినట్టు తెలిపాడు. అయితే తన లాయర్ గా మారడానికి చాలా కష్టపడడ్డారని, అదే విధంగా తాను కూడా కష్టపడ్డానని తెలిపాడు.
ఈ నేపథ్యంలో సునీల్ ఛెత్రి అడిగిన చాలా ప్రశ్నలకు ఈ షోలో సమాధానమిచ్చాడు విరాట్ కోహ్లీ. ఈ క్రమంలో ఒకసారి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పాడిల్ స్కూఫ్ను దొంగలించాలని అనుకున్నట్టుగా చెప్పాడు కోహ్లీ. కాగా, చివరి బంతికి మూడు పరుగులు అవసరమైన సమయంలో వకార్ యూనిస్, షేన్ వార్న్ వీరిద్దరిలో ఎవరిని బౌలింగ్ లో ఆడాలని అనుకుంటావు అని అడిగిన ప్రశ్నకు వాకర్ యూనిస్ బౌలింగ్ అయితే కొట్టగలనని నమ్మకం ఉందని చెప్పాడు. ఇంతేకాదు ఇదే షో లో మరికొన్ని తన చిన్ననాటి విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నాడు విరాట్ కోహ్లీ.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…