Konda Surekha : వరంగల్ రాజకీయాల్లో కొండా దంపతులు లేని రాజాకీయం లేదు. నక్సల్ పార్టీ నుండి రాజకీయాల్లోకి వచ్చిన కొండా మురళి ఆయన భార్య సురేఖ కాంగ్రెస్ పార్టీలో మండల్ పరిషత్ మెంబెర్ నుండి మంత్రి వరకు ఎదిగారు. కొండా మురళి ని చంపించాలని చాలా సార్లు ప్రయత్నాలు జరిగాయి. రెండు వర్గాల మధ్య వర్గపోరుతో మురళి మీద హత్యాయత్నం కూడా జరిగింది. ఇక ఈ విషయాలన్నీ ఇటీవల రామ్ గోపాల్ వర్మ ‘కొండా’ సినిమా తీసి మరీ చూపించాడు. ఇక ఈ సినిమా గురించి కొండా సురేఖ మాట్లాడుతూ వారికి ప్రధాన ప్రత్యర్థి అయిన ఎర్రబెల్లి దయాకర్ రావు గురించి ఆసక్తికర విషయాలను మాట్లాడారు.
దయాకర్ ఎన్కౌంటర్ చేయమని చంద్రబాబు ని అడిగాడు…
దయాకర్ రావు రాజకీయంగా కొండా కుటుంబం వరంగల్ లో ఎదగడం ఇష్టం లేక కొండా మురళి మీద చాలా సార్లు చంపించాలని ప్రయత్తినించాడు అంటూ కొండా సురేఖ ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కొనలేక ఇలా కుట్రలు చేశాడంటూ చెప్పారు. తెలుగు దేశం ప్రభుత్వం ఉన్న సమయంలో దయాకర్ రావు కొండా దంపతులను చంపించాలని అనుకున్నాడట. నేరుగా చంద్ర బాబు నాయుడు గారిని కొండా మురళి ని ఎన్కౌంటర్ చేయమని అడిగాడట.
చంద్ర బాబు పక్కన ఉన్నవాళ్లలో కొంతమంది మాకు తెలిసిన వాళ్ళు ఉన్నాన్నరు, వాళ్ళ ద్వారా ఈ విషయం మ్మాకు తెలిసింది అంటూ కొండా సురేఖ తెలిపారు. అయితే దయాకర్ రావు అలా అడిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు సురేఖ ఎమ్మెల్యే, వారిని అలా ఎలా ఎన్కౌంటర్ చేయమని అడుగుతావ్ బుర్ర ఉందా నీకు అసలు ఒకవేళ చేస్తే ఏమవుతుందో తెలియదా, గవర్నమెంట్ ఉంటుందా అని దయాకర్ ను కోప్పడారు అంటూ సురేఖ తెలిపారు.
వేసవి సెలవుల సందడి ముగిసింది. దాదాపు రెండు నెలల విరామం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు మళ్లీ విద్యార్థులతో కళకళలాడాల్సిన రోజు…
తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. గత కొద్ది రోజులుగా ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వర్షాలు కొంత ఉపశమనం…
అర్ధరాత్రి వేళ పరుగులు తీస్తున్న ఎక్స్ప్రెస్ రైలులో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతోందో అర్థం…
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ప్రభుత్వం కీలక మార్పుల దిశగా ఆలోచిస్తోంది. ఇప్పటివరకు…
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…