తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు కోట శ్రీనివాసరావు ఒకరు. ఒకప్పుడు విలన్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించేవారు. ఎంతగా అంటే ఈయనను చూస్తే ఆడవాళ్ళు సైతం భయపడేవారు. అంతగా తన విలనిజాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. అయితే ప్రస్తుతం కోట శ్రీనివాసరావు వయసు పైబడటం చేత పెద్దగా అవకాశాలు రాలేదని చెప్పవచ్చు.
ఈ క్రమంలోనే ఒకఇంటర్వ్యూలో పాల్గొన్న కోట శ్రీనివాసరావు నేటితరం సినిమాల గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలోనే పాత సినిమాలకు ఈ సినిమాలకు మధ్య ఏదైనా వ్యత్యాసం ఉందా అనే ప్రశ్న ఎదురు కావడంతో అందుకు స్పందించిన కోటశ్రీనివాస్ రావు ఎలాంటి తేడా లేదండి అప్పటి సినిమాలు తల్లిపాలు అయితే ఇప్పటి సినిమాలు డబ్బాపాలు అంతే తేడా ఉందని చెప్పారు.
అప్పటి సినిమాలలో హాస్యం ఉండేది, ఇప్పటి సినిమాలలో కామెడీ ఉంటుంది పెద్ద తేడా ఏమీ లేదు. ఈ క్రమంలోనే ఒకప్పటి సినిమాలకు ఇప్పటి సినిమాల గురించి తెలియజేస్తూ.. బాహుబలి చిత్రాన్ని దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. పెద్ద ఎత్తున గ్రాఫిక్స్ ఉండటం ఈ సినిమాకి హైలైట్ అయ్యాయని చెప్పవచ్చు.
అయితే బాహుబలి సినిమా విడుదల ముందు అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. అయితే ఆ సినిమా విడుదలై మంచి విజయం అందుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి పెద్దగా మాట్లాడటం లేదు. కానీ మాయాబజార్ చిత్రం టీవీలో వస్తుంది అంటే ఇప్పటికి కూడా ఆ సినిమా గురించి మాట్లాడుకుంటారు. మాయాబజార్ చిత్రంలో ఉన్నటువంటి కొన్ని సన్నివేశాలను ఈ తరం వారిని తీయమనండి చూద్దాం.. అలాంటి సన్నివేశాలు తీయాలంటే ఇప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు చేస్తారు ఇప్పటి తరం వాళ్ళు.. అంటూ నేటి తరం సినిమాల గురించి కోట శ్రీనివాసరావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…