General News

ఆ నీళ్లు తాగడం కోసం క్యూ కడుతున్న జనం..ఆ నీళ్ల ప్రత్యేకత ఏమిటో తెలుసా?

మీరు కీళ్ల నొప్పులతో బాధ పడుతున్నారా… అయితే ఈ బోరు నీళ్లు తాగాల్సిందే..ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా కీళ్ల నొప్పులకు బోరు నీళ్ళుకి సంబంధం ఏమిటి? అని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ బోరు నీళ్ల ప్రత్యేకత ఏమిటో మీరు తెలుసుకోవాల్సిందే.. సాధారణంగా వయసు పైబడే కొద్దీ చాలా మంది కీళ్లనొప్పులతో, గ్యాస్ ట్రబుల్ , షుగర్ వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అయితే ఇలాంటి సమస్యలను దూరం చేయడం ఈ బోరు నీళ్ల ప్రత్యేకత అని చెప్పవచ్చు. మరి ఆ బోరు ఎక్కడ ఉందో తెలుసుకుందాం…

కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం తీరువూరు ప్రధాన రహదారిపై తెల్లదేవరపల్లి ఓ చేతిపంపు ఉంది. స్థానికంగా ఉండే ప్రజలు కొన్ని సంవత్సరాల నుంచి ఈ చేతి పంపు నుంచి వచ్చే నీటిని తాగుతున్నారు.కేవలం ఈ గ్రామ ప్రజలు మాత్రమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ చేతి పంపు దగ్గరికి చేరుకొని నీళ్లను తీసుకెళ్ళడం విశేషం.

ఈ చేతి పంపు నుంచి వచ్చే నీటిని ప్రతి రోజు ఉదయం తాగితే వారికి ఉన్నటువంటి కీళ్లనొప్పులు,గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలు తగ్గడంతో ప్రజలు పెద్దఎత్తున ఈ చేతి పంపు దగ్గరికి వచ్చి నీటిని తీసుకువెళుతుంటారు. ఒక్కసారి ఈ చేతిపంపు నీరుతాగితే మరే ఇతర నీటిని తాగడానికి ఇష్టపడరని స్థానికులు చెబుతున్నారు.

ఇక బెంగళూరు, హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు సైతం ఈ చేతిపంపు నీటిని తీసుకువెళుతుంటారని స్థానికులు చెబుతున్నారు. వేసవి కాలంలో అయితే ఈ నీటి కోసం చాలామంది క్యూ కడుతుంటారు. ఈ బోరు నీటిని తాగటం వల్ల మనలో అనారోగ్య సమస్యలు తగ్గిపోవడం వల్లే పెద్ద ఎత్తున ప్రజలు ఈ నీటి కోసం ఇక్కడికి చేరుకుంటారని స్థానికులు చెబుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

4 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

4 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

1 month ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

1 month ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

1 month ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

1 month ago