Krishna Vamsi : రంగ మార్తాండా సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు కృష్ణ వంశీ. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా అయినా, కేక సోషల్ మెసేజ్ అయినా కృష్ణ వంశీ టేకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. రామ్ గోపాల్ వర్మ శిష్యుడైన కృష్ణ వంశీ గులాబీ, సింధూరం, సముద్రం, అంతఃపురం, నిన్నేపెళ్లాడతా, మురారి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు నచ్చారు. ఖడ్గం వంటి సినిమా అయినా మొగుడు వంటి ఫ్యామిలీ డ్రామా అయినా కృష్ణ వంశీ స్టైల్ డిఫరెంట్. కానీ ప్రస్తుతం చాలా గ్యాప్ తరువాత కృష్ణ వంశీ సినిమా తీయబోతున్నారు.
వారి గురించి మాట్లాడొద్దు…
ఇక కృష్ణ వంశీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన రవితేజ ప్రస్తుతం సూపర్ స్టార్ అయ్యాడు. కృష్ణ వంశీ, రవితేజ తో ఒక సినిమా తీయాలని కథ మీద చాలా కష్ట పడ్డాడు, అయితే ఇద్దరి మధ్య ఏవో తేడాలు రావడంతో సినిమా ఆగిపోయింది. ఇక ఈ విషయం పై కృష్ణ వంశీ మాట్లాడటానికి నిరాకరించారు. ఇక బండ్ల గణేష్ గోవిందుడు అందరివాడేలే సినిమా సమయంలో కృష్ణ వంశీ గురించి పరోక్షంగా విమర్శించాడు. సినిమా గురించి కృష్ణ వంశీ కి ధ్యాస లేదు సరిగా చేసుంటే గోవిందుడు అందరివాడేలే సినిమా ఎక్కడో ఉండేది అంటూ కామెంట్స్ చేసాడు. ఇక ఆ విషయంలో కూడా కృష్ణ వంశీ స్పందించలేదు. గతం గతః అయిపోయిన వాటి గురించి ఎందుకు, నేను మాట్లాడదలుచుకోలేదు.
బండ్ల గణేష్ అలా నన్ను అన్నాడనే విషయం నాకు తెలియదు ఒకవేళ అనుంటే అది గతం నేనెందుకు స్పందించాలి అంటూ వేదాంత ధోరణిలో చెప్పాడు. ఇక మొగుడు సినిమా సమయంలో బెల్లంకొండ సురేష్ విషయంలో కూడా వివాదం గురించి మాట దాటవేశారు, సమాధానం చెప్పడం ఇష్టం లేదని అయిపోయిన వాటిని ఎందుకు మాట్లాడాలి, ఆక్షణం అలా జరగాలనుంది జరిగింది అంతే మన చేతుల్లో ఏం లేదు అంటూ మాట్లాడారు కృష్ణ వంశీ. అప్పుడున్న ఒత్తిడిలో కొందరి వ్యక్తుల ప్రభావం వల్ల అలా జరిగిపోయాయి వాటిని ఆలోచించడం మానేసాను అంటూ చెప్పడానికి ఇష్టపడలేదు.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…