Krishna vamsi: గులాబీ, నిన్నే పెళ్లాడుతా, ఖడ్గం వంటి సినిమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు డైరెక్టర్ కృష్ణవంశీ.ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన ఈయన 2017 లో వచ్చిన నక్షత్రం సినిమా తర్వాత ఎలాంటి సినిమాలను చేయలేదు. ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.
ఇకపోతే ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ కృష్ణవంశీ రవితేజ ఈ ముగ్గురు ఎంతో స్నేహంగా ఉండేవారు. ఈ ముగ్గురు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లు పనిచేసే సమయంలో వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలోనే కృష్ణవంశీ రవితేజకు ఎన్నో మంచి అవకాశాలను ఇప్పించారు.ఇకపోతే కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన నిన్నే పెళ్ళాడుతా సినిమా 25 సంవత్సరాల పూర్తి చేసుకోవడంతో ఈయన ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఇంటర్వ్యూ సందర్భంగా నిన్నే పెళ్లాడతా సినిమా గురించి యాంకర్ పలు ప్రశ్నలు అడగగా కృష్ణ వంశీ కూడా ఎన్నో ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలోనే యాంకర్ రవితేజ గురించి ప్రశ్నించారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సింధూరం సినిమాలోని రవితేజ మాస్ ఎలిమెంట్ కనిపించింది. రవితేజను చూడగానే ప్రతి ఒక్కరు ఇలా ఉన్నారు ఎవరు అని మాట్లాడుకున్నారు. ఆయనని మీరే అలా చూపించారా.. లేక ఆయనే అలా చేశారా అంటూ ప్రశ్నించారు.
ఈ విధంగా యాంకర్ రవితేజ గురించి కృష్ణవంశీని ప్రశ్న అడగడంతో వెంటనే కృష్ణవంశీ నెక్స్ట్ క్వశ్చన్ అంటూ ఆ ప్రశ్న దాటవేశాడు. ఇలా కృష్ణవంశీ కనీసం రవితేజ గురించి మాట్లాడటానికి కూడా ఆసక్తి చూపకపోవడంతో వీరిద్దరి మధ్య పెద్ద ఎత్తున విభేదాలు వచ్చాయని తెలుస్తోంది. అయితే ఎంతో స్నేహంగా ఉండే కృష్ణవంశీ రవితేజకు ఎక్కడ చెడింది ఇలా కనీసం తన పేరు కూడా పలకడానికి ఇష్టపడనంతగా వీరి మధ్య విభేదాలు ఏం వచ్చాయనీ ప్రస్తుతం వీరిద్దరి గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఏదిఏమైనా కృష్ణవంశీ రవితేజ గురించి మాట్లాడకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…