Krishnam Raju Daughters:టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందిన విషయం మనకు తెలిసిందే.ఇక సోమవారం మధ్యాహ్నం ఆయన ఫామ్ హౌస్ లో అభిమానులు కుటుంబ సభ్యులు ఆశ్రనయణాల నడుమ ఈయన అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. ఇక కృష్ణంరాజు మరణించడంతో ఈయన కూతుర్ల గురించి పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి.
కృష్ణంరాజు ముగ్గురు కుమార్తెలు ప్రస్తుతం ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చదివారనే విషయాల గురించి ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే కృష్ణంరాజు పెద్ద కుమార్తె ప్రసీద తాజాగా లండన్ లో ఎంబీఏ పూర్తి చేసి ఇండియా తిరిగి వచ్చారు. ఇలా తన చదువును పూర్తి చేసిన ఈమె ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించారు. ఇక రెండవ కుమార్తె ప్రకీర్తి హైదరాబాద్ లోని జేఎన్టీయూ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ కోర్స్ చదువుతున్నారు.
ఇక కృష్ణంరాజు చిన్న కుమార్తె సైకాలజీలో డిగ్రీ పూర్తి చేశారు.ఇలా ఈ ముగ్గురు కుమార్తెలు ఉన్నత చదువులు పూర్తి చేసినప్పటికీ కృష్ణంరాజు ఈ ముగ్గురిలో ఒక్కరికి కూడా పెళ్లి చేయకుండానే కనుమూశారు.ఈ విధంగా ఈయన కూతుర్ల విషయంలో ఎన్నో బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉండగా ఆ బాధ్యతలు నిర్వహించకుండానే అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు.
ఈ విధంగా కృష్ణంరాజు మరణించడంతో ఆయన వారసుడుగా ఇండస్ట్రీకి పరిచయమై కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ప్రభాస్ పైనే తన చెల్లెల బరువు బాధ్యతలు ఉన్నాయని తెలుస్తోంది. ఇకపోతే కృష్ణంరాజు బ్రతికున్న సమయంలోనే ప్రభాస్ కు పెళ్లి చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఆకల కూడా నెరవేరకుండానే కృష్ణంరాజు మృతి చెందడంతో ప్రస్తుతం ఆయన కూతుర్ల పెళ్లి బాధ్యత కూడా ప్రభాస్ పైనే ఉందని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…