Krishnam Raju Daughters:టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందిన విషయం మనకు తెలిసిందే.ఇక సోమవారం మధ్యాహ్నం ఆయన ఫామ్ హౌస్ లో అభిమానులు కుటుంబ సభ్యులు ఆశ్రనయణాల నడుమ ఈయన అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. ఇక కృష్ణంరాజు మరణించడంతో ఈయన కూతుర్ల గురించి పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి.
కృష్ణంరాజు ముగ్గురు కుమార్తెలు ప్రస్తుతం ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చదివారనే విషయాల గురించి ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే కృష్ణంరాజు పెద్ద కుమార్తె ప్రసీద తాజాగా లండన్ లో ఎంబీఏ పూర్తి చేసి ఇండియా తిరిగి వచ్చారు. ఇలా తన చదువును పూర్తి చేసిన ఈమె ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించారు. ఇక రెండవ కుమార్తె ప్రకీర్తి హైదరాబాద్ లోని జేఎన్టీయూ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ కోర్స్ చదువుతున్నారు.
ఇక కృష్ణంరాజు చిన్న కుమార్తె సైకాలజీలో డిగ్రీ పూర్తి చేశారు.ఇలా ఈ ముగ్గురు కుమార్తెలు ఉన్నత చదువులు పూర్తి చేసినప్పటికీ కృష్ణంరాజు ఈ ముగ్గురిలో ఒక్కరికి కూడా పెళ్లి చేయకుండానే కనుమూశారు.ఈ విధంగా ఈయన కూతుర్ల విషయంలో ఎన్నో బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉండగా ఆ బాధ్యతలు నిర్వహించకుండానే అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు.
ఈ విధంగా కృష్ణంరాజు మరణించడంతో ఆయన వారసుడుగా ఇండస్ట్రీకి పరిచయమై కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ప్రభాస్ పైనే తన చెల్లెల బరువు బాధ్యతలు ఉన్నాయని తెలుస్తోంది. ఇకపోతే కృష్ణంరాజు బ్రతికున్న సమయంలోనే ప్రభాస్ కు పెళ్లి చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఆకల కూడా నెరవేరకుండానే కృష్ణంరాజు మృతి చెందడంతో ప్రస్తుతం ఆయన కూతుర్ల పెళ్లి బాధ్యత కూడా ప్రభాస్ పైనే ఉందని తెలుస్తోంది.
వేసవి కాలంలో బయట నిలిపిన బైక్పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…
ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…
తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…
వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…