KTR: ప్రధాని మోదీపై కేటీఆర్ ఆగ్రహం..! నిరసనలు తెలపాలని పిలుపు..!
KTR: రాజ్యసభలో ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ… ఏపీ విభజన, తెలంగాణ ఏర్పాటుపై వ్యాఖ్యానించారు. తెలంగాణకు నేను వ్యతిరేఖం కాదు.. కానీ చర్చించకుండా ఏపీ విభజన చేశారని.. దీంతోనే రెండు రాష్ట్రాలు సమస్యలను ఎదుర్కొంటున్నాయని… కాంగ్రెస్ వల్లే రెండు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు ఏర్పడ్డాయని ఆయన విమర్శించారు.
తాజాగా ఈ వ్యాఖ్యలపై తెలంగాణలో రాజకీయ దుమారం రేగింది. అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రధాని వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రధాని వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ పదేపదే తెలంగాణను అవమానిస్తున్నారని.. దశాబ్ధాల స్పూర్తిదాయక పోరాటాన్ని, ప్రజల త్యాగాన్ని అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం ప్రధానికే అవమానకరం అంటూ.. ప్రధాని క్షమాపణలు చెప్పాలంటూ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.
మరోవైపు ఈరోజు కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో టీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. మండల కేంద్రాలు, నియోజకవర్గాల్లో నల్లజెండాలతో నిరసన తెలుపుతున్నారు. బీజేపీ దిష్టిబొమ్మలను తగలబెడుతున్నారు. రాష్ట్రంలోని మంత్రులు కూడా ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మండి పడుతున్నారు. తెలంగాణకు ఎనిమిదేళ్లుగా ఒక్క పనికూడా చేయలేదని విమర్శిస్తున్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదని అంటున్నారు. దీనికి కౌంటర్గా బీజేపీ పార్టీ కూాడా రియాక్ట్ అయింది. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ టీాఎర్ఎస్ పార్టీని తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని మోదీ విమర్శిస్తే మీకేం నొప్పి అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ డౌన్ ఫాల్ ప్రారంభమైందని అన్నారు.
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…