KTR: ప్రధాని మోదీపై కేటీఆర్ ఆగ్రహం..! నిరసనలు తెలపాలని పిలుపు..!
KTR: రాజ్యసభలో ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ… ఏపీ విభజన, తెలంగాణ ఏర్పాటుపై వ్యాఖ్యానించారు. తెలంగాణకు నేను వ్యతిరేఖం కాదు.. కానీ చర్చించకుండా ఏపీ విభజన చేశారని.. దీంతోనే రెండు రాష్ట్రాలు సమస్యలను ఎదుర్కొంటున్నాయని… కాంగ్రెస్ వల్లే రెండు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు ఏర్పడ్డాయని ఆయన విమర్శించారు.
తాజాగా ఈ వ్యాఖ్యలపై తెలంగాణలో రాజకీయ దుమారం రేగింది. అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రధాని వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రధాని వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ పదేపదే తెలంగాణను అవమానిస్తున్నారని.. దశాబ్ధాల స్పూర్తిదాయక పోరాటాన్ని, ప్రజల త్యాగాన్ని అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం ప్రధానికే అవమానకరం అంటూ.. ప్రధాని క్షమాపణలు చెప్పాలంటూ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.
మరోవైపు ఈరోజు కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో టీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. మండల కేంద్రాలు, నియోజకవర్గాల్లో నల్లజెండాలతో నిరసన తెలుపుతున్నారు. బీజేపీ దిష్టిబొమ్మలను తగలబెడుతున్నారు. రాష్ట్రంలోని మంత్రులు కూడా ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మండి పడుతున్నారు. తెలంగాణకు ఎనిమిదేళ్లుగా ఒక్క పనికూడా చేయలేదని విమర్శిస్తున్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదని అంటున్నారు. దీనికి కౌంటర్గా బీజేపీ పార్టీ కూాడా రియాక్ట్ అయింది. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ టీాఎర్ఎస్ పార్టీని తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని మోదీ విమర్శిస్తే మీకేం నొప్పి అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ డౌన్ ఫాల్ ప్రారంభమైందని అన్నారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…