Lakshmi Parvathi : సీనియర్ ఎన్టీఆర్ రెండో భార్యగా అందరికీ తెలిసిన లక్ష్మి పార్వతి గారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మళ్ళీ మీడియా ముందు తరచూ ఎన్టీఆర్ కుటుంబంపై విమర్శలు గుప్పిస్తుంటారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గురించి అవకాశం దొరికినపుడల్లా వెన్ను పోటు అంటూ ఉపన్యాసాలు ఇస్తుంటారు. మొన్నా మధ్య జగన్ నాకు జీవితాన్ని ఇచ్చాడు అంటూ ఎన్టీఆర్ వర్ధంతి నాడు మాట్లాడిన లక్ష్మి పార్వతి గారు మరోసారి లోకేష్ పాదయాత్ర గురించి కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. ఇక తరచూ నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు మోసం చేస్తున్నాడంటూ చెప్పే లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ గారు కొడుకులకు ఎలా ఆస్తి ఇచ్చారనే విషయాన్నీ తెలిపారు.
ఆస్తులన్నీ పిల్లలకు ఇచ్చి…
రామారావు గారు రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నపుడే పిల్లలందరికీ ఆస్తులను సమంగా ఇచ్చి ఆయనతో ఏ ఆస్తి లేకుండా చేసుకున్నారు అంటూ లక్ష్మి పార్వతి వివరించారు. ఎన్టీఆర్ గారు కొడుకులందరికీ ఇల్లు కట్టించి ఇచ్చారని ఆస్తులను సమానంగా ఇచ్చి రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు.
నా మీద నిందలు వేయడానికి ఆస్తుల కోసం, పదవుల కోసం ఎన్టీఆర్ గారి పక్కన చేరినట్లు నా మీద నిందలు వేస్తారు. కానీ నేను వచ్చే సమయానికి ఆయన వద్ధ ఎలాంటి ఆస్తులు లేవు. ఇక పదవుల మీద నాకు వ్యామోహం ఉండి ఉంటే నేను ఎపుడో పదవులను తీసుకుని ఉండేదాన్ని. ఆయన ఎన్నో సార్లు అడిగారు కానీ నేను తిరస్కరించాను అంటూ వివరించారు లక్ష్మి పార్వతి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…