ఇటీవల సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి. ఆ మాటలు రాజకీయంగా పెను సంచలనమే స్పష్టించాయి అనుకోవచ్చు. అతడి మాటలకు ఎవరు భయపడే వారు లేరని.. సంపూర్ణేష్ బాబు ఎలానో.. పవన్ కాళ్యాణ్ కూడా అంతే అంటూ ఏపీ మంత్రులు కామెంట్ చేసిన విషయం తెలిసిందే.
అయితే పోసాని కూడా పవన్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డాడు. దానికి పవన్ ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తుండగా.. వాటికి ప్రతి కౌంటర్ గా పోసాని మాట్లాడుతూనే ఉన్నారు. తాజాగా జనసేన అధినేత పవన్పై ఏపీ తెలుగు,సంస్కృత అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి షాకింగ్ కామెంట్స్ చేశారు. అతడు విషం పాకిన చెట్టు నీడలో ఉన్నాడని.. అక్కడ ఉన్నంత కాలం ఎదగలేరన్నారు.
తను సొంతంగా ప్రజల్లోకి వెళితే తప్ప నాయకుడు కాలేరని.. పది అడుగులు నడిచి ప్రజలు ఎక్కువగా కనిపిస్తే.. పక్కనే వచ్చే కారు ఎక్కే నువ్వు.. జగన్ లాగా పాదయాత్ర చేయగలవా అంటూ ప్రశ్నించారు. పవన్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. అతడి సిద్దాంతం ఏంటో అతడికైనా తెలుసా… అంటూ వ్యగ్యంగా మాట్లాడారు.
సినిమా టికెట్లను ఆన్ లైన్ లో పెట్టడం అనే నిర్ణయాన్ని చిరంజీవి, సీ కళ్యాణ్ ఇతరులు సీఎం జగన్ ను కలిసిన తర్వాతే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో నాయకుడిగా చెప్పుకునే నువ్వు.. దొంగ టికెట్లను సపోర్టు చేస్తే.. నాయకుడివి ఎలా అవుతావని ప్రశ్నించారు. మంచి వైపు మాట్లాడే వారు లీడర్లు అని.. జగన్ ఎం తప్పు చేశారని మాట్లాడుతున్నావ్ అంటూ అడిగారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…