ఇటీవల సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి. ఆ మాటలు రాజకీయంగా పెను సంచలనమే స్పష్టించాయి అనుకోవచ్చు. అతడి మాటలకు ఎవరు భయపడే వారు లేరని.. సంపూర్ణేష్ బాబు ఎలానో.. పవన్ కాళ్యాణ్ కూడా అంతే అంటూ ఏపీ మంత్రులు కామెంట్ చేసిన విషయం తెలిసిందే.
అయితే పోసాని కూడా పవన్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డాడు. దానికి పవన్ ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తుండగా.. వాటికి ప్రతి కౌంటర్ గా పోసాని మాట్లాడుతూనే ఉన్నారు. తాజాగా జనసేన అధినేత పవన్పై ఏపీ తెలుగు,సంస్కృత అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి షాకింగ్ కామెంట్స్ చేశారు. అతడు విషం పాకిన చెట్టు నీడలో ఉన్నాడని.. అక్కడ ఉన్నంత కాలం ఎదగలేరన్నారు.
తను సొంతంగా ప్రజల్లోకి వెళితే తప్ప నాయకుడు కాలేరని.. పది అడుగులు నడిచి ప్రజలు ఎక్కువగా కనిపిస్తే.. పక్కనే వచ్చే కారు ఎక్కే నువ్వు.. జగన్ లాగా పాదయాత్ర చేయగలవా అంటూ ప్రశ్నించారు. పవన్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. అతడి సిద్దాంతం ఏంటో అతడికైనా తెలుసా… అంటూ వ్యగ్యంగా మాట్లాడారు.
సినిమా టికెట్లను ఆన్ లైన్ లో పెట్టడం అనే నిర్ణయాన్ని చిరంజీవి, సీ కళ్యాణ్ ఇతరులు సీఎం జగన్ ను కలిసిన తర్వాతే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో నాయకుడిగా చెప్పుకునే నువ్వు.. దొంగ టికెట్లను సపోర్టు చేస్తే.. నాయకుడివి ఎలా అవుతావని ప్రశ్నించారు. మంచి వైపు మాట్లాడే వారు లీడర్లు అని.. జగన్ ఎం తప్పు చేశారని మాట్లాడుతున్నావ్ అంటూ అడిగారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…