పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు ఇటు సినీ రంగంలో.. అటు రాజకీయంగా తీవ్ర సంచలనంగా మారాయి. నటీనటులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. టికెట్లను ఆన్ లైన్ లో ఇవ్వడంపై తీవ్రంగా వ్యతికేకించడంతో పాటు.. ఏపీ మంత్రిని కూడా తీవ్రంగా దూషించాడు.
ఇదిలా ఉండగా.. ఆ వ్యాఖ్యల తర్వాత జనసేన కార్యకర్తల్లో కాస్త ఊపు వచ్చిందనే చెప్పాలి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. తాజాగా అతడు హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. గన్నవరం నుండి ఆయన కారులో జనసైనికులతో కలిసి ర్యాలీ జనసేన కార్యాలయానికి చేరుకొన్నారు.
అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని ఆందోళనలతో పాటు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై జనసేన విస్తృతస్థాయి సమావేశాన్ని జనసేన ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ గుంటూరు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ లో రోడ్లపరిస్థితి దారుణంగా ఉందని.. దీనిపై ఆందోళన కార్యక్రమాలను నిర్వమిస్తామని పవన్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అతడి కార్యకర్తలే మాట్లాడారు. అంతేకాకుండా అక్టోబర్ 30 న బద్వేల్ లో జరిగే ఉప ఎన్నికలో తమ పార్టీ తరఫున పోటీ చేసే అంశంపై కూడా పవన్ చర్చించునున్నారు.
ఈ సమావేశం ముగిసిన తర్వాత కడప జిల్లా నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఇదిలా ఉండగా.. ఈ పర్యటలో అపశృతి చోటు చేసుకుంది. గుంటూరులోని మంగళగిరి డీజీపీ కార్యాలయ సమీపంలోకి ఆయన కాన్వాయ్ రాగానే.. ప్రమాదవ శాత్తు కాన్వాయ్లోని రెండు కార్లు ఢీకొన్నాయి. ఎయిర్బ్యాగ్స్ తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీనిలో ఓ అభిమానికి గాయాలు అయినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…