Poojitha-Lakshmi Parvati: అలా చేసినందుకు బాంబులు వేసి లేపేస్తాం… యాసిడ్ పోస్తామని హెచ్చరించారు: నటి పూజిత
Poojitha-Lakshmi Parvati: అలనాటి నటి పూజిత మళ్లీ తెరపై యాక్టివ్ కాబోతున్నారు. ‘ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్’ వంటి ఎవర్ గ్రీన్ కామెడీ సినిమాలో పాటు 138కి పైగా సినిమాలు నటించిన పూజిత చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజగా మరోసారి ఆమె వెండితెరపై మెరవబోతున్నారు. వరసగా రెండు సినిమాలకు సైన్ చేశారు. అయితే తన కెరీర్లో జరిగిన ఓ విషయంపై ఆమె స్పందించారు.
లక్ష్మీ పార్వతితో తనకున్న విభేదాలను బయటపెట్టారు. అప్పట్లో ’అమ్మో అల్లుడా.‘ అనే సినిమా వచ్చిందని పూర్తిగా పొలిటికల్ సినిమా అని చెప్పింది. దీంట్లో నేను లక్ష్మీ పార్వతి క్యారెక్టర్ చేశానని చెప్పుకొచ్చింది పూజిత. కోనేరు రవీంద్ర ఆ చిత్రానికి నిర్మాత. ఆ సినిమాలో నా క్యారెక్టర్ చాలా గొప్పగా ఉంటుందని చెప్పి.. సినిమాలో నన్ను పెట్టారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ రోల్ కూడా ఉంటుందని ఆయనకు భార్యగా లక్ష్మీ పార్వతి పాత్రలో నటించాలని చెప్పారు. అయితే ఆమె పేరును ఎక్కడా కూడా వాడలేదని తెలిపారు. ఈ సినిమా క్లైమాక్స్ లో ఉండగానే ఎన్టీఆర్ గారు చనిపోయారని చెప్పింది.
ఎన్టీఆర్ చనిపోయినప్పడు.. ఆయన ఇంటికి వెళ్లానని.. స్టేడియంకి కూడా వెళ్లానని చెప్పింది. అయితే ఆ సందర్భంలో లక్ష్మీ పార్వతి చేసిన కొన్ని విషయాలను… నేను సినిమాలో అలాగే చేశానని చెప్పుకొచ్చింది. అయితే ఈ సన్నివేశాలు లక్ష్మీ పార్వతికి బలంగా తాకినట్లు చెప్పింది.
ఎన్టీఆర్ చనిపోయిన సందర్భంలో కాఫీ తాగుతున్న లక్ష్మీ పార్వతి.. పీవీ నరసింహరావు రాగానే తాగే కప్పును పక్కన పెట్టి ఏడ్వడం స్టార్ట్ చేసిందని… చెప్పింది పూజిత. అయితే ఆ సన్నివేశం నామదిలో అలాగే ఉందని తెలిపింది. ఎవరైనా వస్తే ఉన్నపళంగా బాగా ఏడవాలన్నమాట అని అర్థమైంది. ఈ సన్నివేశాన్ని సినిమాలో యదాతథంగా నేను చేశాను. ఈసీన్ చూసి లక్ష్మీ పార్వతి నున్ను బాంబులతో లేపేస్తా.. యాసిడ్ పోయిస్తా.. అని చెప్పి అప్పట్లో నాపై కేసు పెట్టారు. అయితే దాన్ని చిత్ర నిర్మాత, డైరెక్టర్ చూసుకున్నారన్నారు. నేను ఓ నటిని.. డైరెక్టర్, నిర్మాతలు చెప్పినట్లు నటించడం మాత్రమే నాపని అని చెప్పుకొచ్చింది పూజిత. కేసులతో నాకేంటి సంబంధం అని అంది. అయితే ఆ తరువాత లక్ష్మీ పార్వతిని రెండు మూడు సార్లు కలిశాను ఆమె సరిగ్గా మాట్లాడలేదని చెప్పింది పూజిత.
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…
ఐపీఎల్ 2026 సీజన్లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్కు…
అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…