Viral: ఆ కుర్చీ మడత పెట్టి అనే డైలాగుతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు తెలంగాణకు చెందిన షాషా అనే తాత. ఈయన గత కొన్ని నెలల క్రితం తెలంగాణలో రాజకీయాల గురించి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కుర్చీ మడతపెట్టి అంటూ చెప్పినటువంటి డైలాగ్ పెద్ద ఎత్తున ఫేమస్ అయ్యింది. ఈ డైలాగ్ ఎంతలా ఫేమస్ అయ్యింది అంటే ఏకంగా మహేష్ బాబు సినిమాలో పాట పెట్టే అంతగా ఫేమస్ అయ్యింది.
ఇక ఈ డైలాగ్ తో తాత కూడా బాగా ట్రెండ్ అవుతున్నారు. ఇక మహేష్ బాబు సినిమాలో కుర్చీ మడత పెట్టు అనే పాట రిలీజ్ చేసినప్పటి నుంచి ఈ తాత మరింత వైరల్ అవ్వడమే కాకుండా వరుస ఇంటర్వ్యూలకు కూడా హాజరవుతున్నారు.ఇలా పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నటువంటి కుర్చీ తాత ఈ సినిమాలో తన డైలాగ్ చెప్పినటువంటి పాట పెట్టడం చాలా సంతోషంగా ఉందని ఈ పాట తానే పాడాను అంటూ కూడా తెలియజేశారు.
ఇక ఈ పాట పాడినందుకు తనకు లక్ష రూపాయలు ఇచ్చారని చాలా సంతోషంగా ఉంది అంటూ ఈయన పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఈ సినిమాలోని పాట గురించి పలు విషయాలను తెలిపారు. అయితే ఇటీవల కూర్చుతాత ఆర్టీసీ బస్సులలో భిక్షాటన చేస్తూ అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చారు.
నన్ను కుర్చీ తాత అంటారు…
ఆర్టీసీ బస్సులలో కుర్చీ తాత భిక్షాటన చేస్తూ నన్ను కుర్చీ తాత అంటారండి ఒక రూపాయి కూడా లేదా అండి అంటూ ఈయన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి బిక్షం అడుగుతో కనిపించారు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు . పాట పాడి లక్ష రూపాయలు తీసుకున్నటువంటి ఈయనే ఇలా భిక్షాటన చేయడం ఏంటి అంటూ షాక్ అవుతున్నారు. నిజంగానే ఈయన పరిస్థితి ఇలా ఉందా లేకుంటే ప్రమోషన్లలో భాగంగా ఇలా చేస్తున్నారా అన్న విషయం తెలియాల్సి ఉంది.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…