దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పదో తరగతి, ఇంటర్ పాసైన విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ 2019 ద్వారా ఎల్ఐసీ ప్రతిభ గల విద్యార్థులకు స్కాలర్ షిప్ ఇస్తోంది. ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో రకాల పాలసీలను తెచ్చిన ఎల్ఐసీ ప్రతిభ గల విద్యార్థులకు ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తోంది. ఎల్ఐసీ పాలసీల ద్వారా ఆర్థిక లక్ష్యాలను చేరుకునే అవకాశాలను, ఆర్థిక భద్రతను కల్పిస్తోంది.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్పెషల్ గర్ల్ స్కాలర్షిప్, రెగ్యులర్ స్కాలర్షిప్ పేరుతో రెండు స్కాలర్ షిప్ లను ఇస్తోంది. ఇంటర్ పాసైన వాళ్లు రెగ్యులర్ స్కాలర్ షిప్ ను పొందవచ్చు. తల్లిదండ్రుల వార్షికాదాయం లక్ష రూపాయల లోపు ఉన్న విద్యార్థులు మాత్రమే ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంటర్ లో కనీసం 60 శాతం మార్కులతో పాసైన విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
2018 – 19 అకాడమిక్ ఇయర్ విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో ఎల్ఐసీ డివిజినల్ సెంటర్కు పది మంది అబ్బాయిలు, పది మంది అమ్మాయిలకు డివిజనల్ స్కాలర్ షిప్స్ లభిస్తాయి. అదే విధంగా విద్యార్థినులు స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ ను పొందే అవకాశం ఉంటుంది. 2018 – 19 అకాడమిక్ ఇయర్ లో పది పాసైన విద్యార్హినులు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఒక్కో ఎల్ఐసీ డివిజినల్ సెంటర్కు పది మంది విద్యార్థినులు ఈ స్కాలర్ షిప్ ను పొందవచ్చు. https://customer.onlinelic.in/liceps/portlets/visitor/gjf/gjfcontroller.jpf వెబ్ సైట్ ద్వారా ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రెగ్యులర్ విద్యార్థులకు సంవత్సరానికి 20,000 రూపాయలు, స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ కింద 10,000 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…