దేశవ్యాప్తంగా మద్యం హోమ్ డెలివరీ కాబోతుంది. ఒకటి రెండు రోజుల్లో డెలివరీ చేసేందుకు కొన్ని సంస్థలకు ఆదేశాలు ఇవ్వబోతోంది ప్రభుత్వం. కానీ ఇది మన దేశంలో కాదులెండి దుబాయ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా చాలా దేశాలలో ప్రభుత్వ ఆదాయం పూర్తిగా దెబ్బతింది. సరిగ్గా దుబాయ్ లో కూడా ఇదే పరిస్థితి. దానితో దుబాయ్ ప్రభుతం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమంగా జరుగుతున్నా మధ్య సరఫరాను అడ్డుకోవంతో పాటు లాక్ డౌన్ కారణంగా దెబ్బతిన్న ప్రభుత్వ ఆదాయాన్ని పూడ్చుకోవడానికి మద్యాన్ని హోం డెలివరీ చేయాలనీ నిర్ణయించింది.
ఇందుకోసం ప్రభుత్వానికి చెందిన మారిటైం అండ్ మార్కంటైల్ ఇంటెర్నేషనల్ (ఎంఎంఐ) మరియు ఆఫ్రికన్ ఈస్టర్ సంస్థలు కలిసి ఈ మద్యం సరఫాను చేయనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రెండు సంస్థలు కలిసి https://www.legalhomedelivery.com అనే వెబ్సైటు ను సైతం రూపొందించాయి.
అయితే దీనిపై కొన్ని కండిషన్స్ కూడా పెట్టింది దుబాయ్ ప్రభుత్వం. దుబాయ్ లో ఉన్న పర్యాటకులు తమ పాస్ పోర్టును ఆధారంగా చూపించి మద్యం కొనుగోలు చేయొచ్చు. కానీ స్థానికులకు మద్యం సరఫరా చేయాలి అంటే మాత్రం పోలీసులనుంచి ఆల్కహాల్ లైసెన్స్ కంపల్సరీ. 21 సంవత్సరాలు నిండిన ముస్లిమేతరులు మాత్రమే ఈ లైసెన్స్ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. మరోపక్క కరోనా వైరస్ ను కట్టడి చేయడం కోసం దుబాయ్ మొత్తం లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే బార్లు, హోటళ్లు మొత్తం మూసివేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…