LR Eswari: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం పుష్ప ఈ సినిమాలోని ఉ అంటవా మామ అనే స్పెషల్ సాంగ్ ఎంతగా ఆదరణ పొందిందో మనకు తెలిసిందే. డిఎస్పి సంగీత సారథ్యంలో ఇంద్రావతి చౌహన్ పాడినటువంటి ఈ పాటకు సమంత స్టెప్పులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పాలి. ఈ పాట ద్వారా సమంత బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.
ఇక ఈ పాట అప్పట్లో పెద్ద ఎత్తున సోషల్ మీడియాని షేక్ చేసిందని చెప్పాలి. ఎంతో ఫేమస్ అయినటువంటి ఈ పాట గురించి సింగర్ ఈశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె పుష్ప సినిమాలోని ఈ స్పెషల్ సాంగ్ గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
అప్పట్లో తాము పాడే పాటలకు ఎంతో మంచి ఆదరణ ఉండేదని ఇప్పటికీ కూడా ఆ పాటలు నిలుస్తున్నాయి అంటే ఆ పాటలు ఎంతో గొప్పగా ఉండేవని తెలిపారు. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి పాటలకు పెద్దగా ఆదరణ లేదని ఈమె తెలియజేశారు. గత కొద్ది రోజుల క్రితం వచ్చినటువంటి ఉ అంటావా మామ ఊ..ఊ అంటావా మావ అనే పాట విన్నాను అసలు అది కూడా ఓ పాటేనా అంటూ ఈమె కామెంట్ చేశారు.
ఈ పాట మొదటి నుంచి చివరి వరకు ఒకే విధంగా ఉంది కనీసం మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఈ విషయం చూసుకోవాలి కదా.. పిల్లలకి ఏం తెలుసు వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్లు చెప్పిన విధంగా పాడతారు. ఆ పాటే కనుక నా దగ్గరకు వచ్చి ఉంటే మరోలా ఉండేదని ఈ సందర్భంగా ఈశ్వరి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
బిగ్బాస్ ఫేమ్ అషు రెడ్డి, టెక్కీ ధర్మేంద్ర మధ్య నెలకొన్న ఆర్థిక వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. పెళ్లి…
దక్షిణ భారత సినీ ప్రపంచంలో తన ప్రత్యేక నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సత్యరాజ్ ప్రయాణం ఎంతో కష్టసాధ్యంగా సాగింది. నేటి…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన అనుష్క శెట్టి తన సినీ ప్రయాణంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా…
ప్రమాదకర బైక్ స్టంట్లపై హైదరాబాద్ పోలీసులు మరోసారి కఠిన హెచ్చరిక జారీ చేశారు. నగర పోలీస్ కమిషనర్ వి. సి.…
టాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన మంచు లక్ష్మి రాజకీయ ప్రవేశంపై చేసిన తాజా వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.…
టాలీవుడ్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చిత్రాల్లో ఒకటి పోకిరి. సరిగ్గా 20 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా,…