M.S. Vikram : తెలుగులో కమెడియన్స్ ఎంతో మంది ఉన్నా కొంతమంది మాత్రం మన మనస్సులో చెరగని ముద్ర వేస్తారు. అలాంటి ఒక వ్యక్తి ఎంఎస్ నారాయణ గారు. ఆయన ఉన్న ప్రతి సినిమా విజయం సాధించకపోవచ్చు కానీ ఆయన చేసిన కామెడీ మాత్రం బాగా హిట్ అవుతుంది. తెలుగు కమెడియన్స్ బిజీ ఆర్టిస్ట్ ల్లో ఒకరిగా ఉన్న ఎంఎస్ నారాయణ గారు అనారోగ్య కారణాలతో అర్థాంతరంగా మరణించారు. ఇక ఆయన గురించి ఆయన కొడుకు విక్రమ్ ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు. విక్రమ్ ను హీరో గా చూడాలన్నది నారాయణ గారి కోరిక అందుకే ఆయన డైరెక్టర్ గా ‘కొడుకు’ అనే సినిమా కూడా తీశారు. అయితే ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ కాకపోవడం వల్ల విక్రమ్ ఇండస్ట్రీలో సరిగా నిలదొక్కుకోలేక పోయాడు.
డైరెక్టర్ సాగర్ కి మైండ్ దొబ్బింది…
రామసక్కనోడు, అమ్మ దొంగ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ సాగర్ సినిమాలో ఎంఎస్ గారు నటించినపుడు షూటింగ్ కి తాగి వస్తే కొట్టాను అంటూ సాగర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సంచలన వాఖ్యలు చేసారు. ఇక వీటి ప్రస్తావన ఎంఎస్ నారాయణ గారి అబ్బాయి విక్రమ్ వద్ద రాగా విక్రమ్ స్పందిస్తూ అలాంటిదేమీ లేదు. ఆయన మరణించిన ఇన్నేళ్లకు ఈ విషయంలో మాట్లాడటం ఏమిటి.
చనిపోయినవారు ఎలాగూ తిరిగి వచ్చి చెప్పలేరని ఇలాంటివి మాట్లాడుతారా, ఆయన ఇమేజ్ ముందు సాగర్ అనే డైరెక్టర్ ఎంతటి వాడు, అలా మాట్లాడకూడదు, ఈ మధ్య కాలంలో వయసు పెరిగి మైండ్ దొబ్బినట్లుంది. సాగర్ గారు కొడుతూ ఉంటే చూస్తూ ఉండేవాళ్ళు ఎవరూ లేరు మా కుటుంబంలో. ఇలాంటి మాటలు మాట్లాడకండి లేనివి అంటూ విక్రమ్ ఫైర్ అయ్యారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…