Movie News

మా ఎన్నికలలో అతనికి మద్దతు తెలుపుతూ.. కామెంట్ చేసిన నటి విజయశాంతి !!

రాబోయే రెండు నెలల్లో జరగనున్న మా ఎన్నికల గురించి ఫిలింనగర్ ఇండస్ట్రీలో ఇప్పటినుంచి వేడి వాతావరణం రాసుకుంటుంది.ఈ క్రమంలోనే మా అధ్యక్ష పీఠంపై కొలువుదీరడానికి పలువురు బరిలోకి దిగనున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, అదేవిధంగా నటుడు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ బరిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ ప్యానెల్ సిద్ధం చేసి తాను ఎన్నికల బరిలో దిగబోతున్నట్లు తెలిపారు.

అదేవిధంగా నటుడు మోహన్ బాబు తనయుడు విష్ణు కూడా అధికారికంగా తను మా ఎన్నికల బరిలో దిగబోతునట్లు తెలుపుతూ సినీ కార్మికుల కష్టాలలో వారి వెంటే ఉంటూ వారికి సహాయం చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికే ఈ నలుగురి మధ్య పోటాపోటీ భారీగా నెలకొనడంతో మా అధ్యక్ష పీఠం ఎవరికి దక్కుతుందనే అంశంపై ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమంలోనే మా అధ్యక్షపీఠం పై కొలువు తీరడం కోసం స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు సీవీఎల్‌ నరసింహారావు ప్రకటించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.సీవీఎల్‌ నరసింహారావు ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడమే కాకుండా ఉత్కంఠభరితమైన వాదనతో ఎన్నికలలో నిలబడటం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

వృత్తిపరంగా లాయర్ అయినటువంటి సీవీఎల్‌ నరసింహారావు గారు మా ఎన్నికలలో పోటీ చేయడమే కాకుండా మా సభ్యుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ క్రమంలోనే తెలుగు కళాకారులకు ప్రస్తుతం తీవ్రమైన అన్యాయం జరుగుతోందనే అంశాన్ని తెరపైకి తెచ్చారు. తెలంగాణ వాదంతో తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు సంచలన ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే సీనియర్ నటి విజయశాంతి మాట్లాడుతూ.. మా ఎన్నికలపై సీవీఎల్‌ నరసింహారావు అవేదన న్యాయమైనది, ధర్మమైంది. నేను అందులో సభ్యురాలిని కాకపోయినా ఒక కళాకారిణిగా పూర్తి మద్దతు నరసింహారావు గారికే అని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

వేడి బైక్ సీటు.. పురుషుల ఫెర్టిలిటీకి ముప్పా? రోజూ బైక్ వాడేవారికి ముఖ్య సూచనలు.. జాగ్రత్తలు తప్పనిసరి

వేసవి కాలంలో బయట నిలిపిన బైక్‌పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…

6 hours ago

డ్రై ఫిష్ తింటే ఎముకలు బలంగా మారుతాయా? ఆశ్చర్యపరిచే లాభాలు!

ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…

6 hours ago

మురాది ఆంజనేయస్వామి ఆలయంలో భారీ హుండీ ఆదాయం.. భక్తుల విశ్వాసం మరోసారి రుజువు!

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

6 hours ago

శ్రీకాకుళం టూర్‌లో ఉపరాష్ట్రపతి.. అరసవల్లి, శ్రీకూర్మం ఆలయాల్లో ప్రత్యేక పూజలు!

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…

6 hours ago

జై వాసవి నినాదాలతో మారుమోగిన సిద్దిపేట.. అంగరంగ వైభవంగా రథయాత్ర!

తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…

6 hours ago

మోహిని ఏకాదశి వ్రతం చేస్తే ఏమవుతుంది? పురాణాల్లో ఆసక్తికర విశేషాలు!

వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…

7 hours ago