సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ గా కొనసాగిన నటి హేమ “మా”నిధులను దుర్వినియోగం చేశారంటూ మా అధ్యక్షుడు పై ఆరోపణలు చేశారు.కావాలనే మా అధ్యక్షుడిగా మరికొన్ని రోజులు కొనసాగాలనే ఉద్దేశంతోనే మా ఎన్నికలు జరగడం లేదంటూ నటి ఆరోపణలపై తాజాగా మా అధ్యక్షుడు నరేష్, జీవిత స్పందిస్తూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సోమవారం మీడియా ముందు మాట్లాడిన నరేష్ నటి హేమ వ్యాఖ్యలపై ఈ విధంగా స్పందించారు..
గత రెండు సంవత్సరాల నుంచి “మా” లో ఏం జరిగింది అనే విషయాలను గురించి నరేష్ మీడియా ముందు సవివరంగా వివరించారు. ఈ క్రమంలోనే నటి హేమ అసోసియేషన్ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడారని, ఆమె మాట్లాడిన మాటలు అందరినీ ఎంతో ఆశ్చర్యానికి గురి చేశాయని తెలిపారు. మా డబ్బులను గోల్ మాల్ చేశామని నటి ఆరోపించడంతో స్పందించిన నరేష్ “మా”డబ్బులలో ఎలాంటి గోల్ మాల్ జరగలేదని ఇప్పటికీ “మా”లో సరిపడే డబ్బులు ఉన్నాయని తెలిపారు.
కరోనా విపత్కర పరిస్థితులలో సినీ కార్మికుల కోసం పలువురు సెలబ్రిటీలు డొనేట్ చేసిన డబ్బులు కూడా భద్రంగా ఉన్నాయని ఈ సందర్భంగా నరేష్ వివరించారు.ప్రస్తుతం మా ఎలక్షన్స్ జరగాల్సి ఉండగా కరోనా పరిస్థితుల వల్ల ఈ ఎలక్షలను వాయిదా వేస్తున్నారు.ఈ క్రమంలోనే పరిస్థితులు చక్కబడ్డాక తప్పకుండా ఎన్నికలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా మా అధ్యక్షుడు నరేష్ మీడియా ముందు వెల్లడించారు.
ఈ క్రమంలోనే నటి జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ హేమ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుత వుండే ఈ కరోనా పరిస్థితులలో ఎవరిని ఫండ్ అడుగుతామని ఆమె నిలదీశారు.గతంలో కొత్త కమిటీ ఏర్పడినప్పుడు పెద్ద హీరోలు అందరూ వారి రెమ్యూనరేషన్ లో కొంత శాతం మా అసోసియేషన్ కి ఇస్తామని తెలిపారు. అయితే ప్రస్తుతం వారిని డబ్బులు అడుగలేని పరిస్థితిలో ఉన్నామని జీవిత తెలియజేశారు. ఇకపోతే ఆగస్టు 22వ తేదీ ఏజీఎం నడుపుతామని, ఆ రోజు సభ్యులంతా ఎలక్షన్లు ఎప్పుడు జరపాలి అనే విషయం గురించి నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా జీవిత వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…