Madhumitha siva balaji : ‘ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శివ బాలాజీ ఆ తరువాత ఎలా చెప్పను, దోస్త్ సినిమాల్లో నటించారు. అయితే శివ బాలాజీ కి మంచి పేరు తెచ్చిన సినిమా మాత్రం ‘ఆర్య’. బన్నీ నటించిన ఆర్య సినిమాల్లో విలన్ షేడ్ ఉన్న పాత్రలో అజయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తరువాత ‘సంక్రాంతి’ సినిమాతో మరో మంచి హిట్ అందుకున్న శివ బాలాజీ. తన 17 ఏళ్ళ వయసులోనే తండ్రి వ్యాపారాలను చూసుకుంటూ 22 ఏళ్లకే సొంత వ్యాపార సంస్థలను పెట్టాడు. ఇక సినిమాల మీద ఆసక్తితో ఇండస్ట్రీ వైపు వచ్చిన శివ బాలాజీ నటి మధుమిత ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక వారి లవ్ స్టోరీ, వైవాహిక జీవితం గురించిన ముచ్చట్లను తాజాగా ఒక ఇంటర్వ్యూలో మధు శివబాలాజీ పంచుకున్నారు.
మా పిల్లలకు కొన్ని రూల్స్…
శివ బాలాజీ 18 ఏళ్ళ వయసులోనే నెక్స్ట్ 30 ఏళ్ళు ఎలా బ్రతకాలి, తన గోల్స్ ఎలా రీచ్ అవ్వాలి అన్నట్లు ప్లాన్ చేసుకున్నారట. అలా చిన్న వయసులోనే వ్యాపారంలో బాగా రాణించిన శివ బాలాజీ ఇక తన కుటుంబం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానంటూ తెలిపారు. మధు శివ బాలాజీ లకు ఇద్దరు మగపిల్లలు ధన్వీన్, గగన్. ఇక మధు ఇంటి బాధత్యలను తీసుకుని పిల్లలను వారి చదువులను చూసుకుంటుండగా బాలాజీ సినిమాలు, వ్యాపారం లో బిజీ. అయినా కూడా వారి పిల్లలను ఎలా పెంచాలి అనే విషయంలో ఇద్దరూ ప్లాన్ చేసుకున్నామంటూ చెబుతున్నారు. వాళ్ళు తినే ఆహారం వేస్ట్ చేయకుండా చాలా స్ట్రిక్ట్ గా ఉన్నామంటూ చెప్పారు.
టీవీ ముందు కూర్చొని తిన్నా, టేబుల్ మీద తిన్నా కింద ఫుడ్ చల్లితే వాళ్ళే క్లీన్ చేయాలి. ఇక వంటింటి సామాన్లు ఎక్కువ వాడారంటే వాళ్ళే క్లీన్ చేయాలి, వాళ్ళ ప్లేట్ వాళ్ళే కడగాలి ఇలాంటి నియమాలు బాలాజీ పెట్టారంట. వారికి కంఫర్ట్స్ మాత్రమే కాదు కష్టం కూడా తెలియాలి అన్నది ఆయన ఉదేశం. ఇక వారానికి ఒక రోజు మాత్రమే ప్లే స్టేషన్ ఆడాలి అన్నది మరో నిబంధన అంటూ తెలిపారు. ఇక వారి చదువు స్కూల్ లో మీటింగ్స్ అవన్నీ మధు బాధ్యత అంటూ తెలిపారు బాలాజీ. ఇక మధు చెబుతూ వాళ్ళు ఎంత డబ్బు సంపాదించాలి, ఎలా సెటిల్ అవ్వాలి అనే దానికంటే వాళ్ళు గుడ్ సిటిజన్స్ గా ఉండాలన్నది తల్లిగా నా కోరిక అంటూ తెలిపారు.
వేసవి కాలంలో బయట నిలిపిన బైక్పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…
ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…
తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…
వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…