వేసవికాలం వచ్చిందంటే చాలు అందరూ ఎంతో ఇష్టంగా తినే పండ్లలో మామిడి పండ్లు ఒకటి. మామిడి పండును పండ్లలో రారాజుగా భావిస్తారు. ఎన్నో పోషక విలువలతో కూడిన ఈ పండ్లను తినడానికి ప్రజలు ఎంతో ఇష్టపడతారు. ఈ క్రమంలోనే మన రాష్ట్రాలలో దొరికే బంగినపల్లి, రసాలు, నీలం వంటి రకాలకు చెందిన మామిడిపండ్లు ఎక్కువగా పండిస్తారు. వీటి ధర కూడా మనకు ఎంతో అందుబాటులోనే ఉంటుంది.కానీ మధ్యప్రదేశ్ కి చెందిన ఓ మామిడి పండు రకము మాత్రం కిలో రూ 1000 పలుకుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
మధ్యప్రదేశ్ అలీరాజ్పూర్ జిల్లాలోని కత్తివాడ ప్రాంతాలో మాత్రమే పండే ‘నూర్జహాన్’ మామిడి పళ్లకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ మామిడి పండ్లు ఒక్కొక్కటి సుమారు కిలోల బరువును కలిగి ఉంటాయి. ప్రస్తుతం ఈ పండు ధర ఏకంగా వెయ్యి రూపాయలు పలుకుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పండు సైజు పెద్దగా ఉండటంతో అత్యధిక ధర పలుకుతోందని రైతులు తెలియజేస్తున్నారు.
ఎంతో రుచికరమైన ఎన్నో పోషకాలు కలిగిన ‘నూర్జహాన్’ మామిడి పండ్ల కోసం ముందుగానే బుకింగ్ చేసుకుంటారని, ఒక్కో పండు సుమారు 2 కిలోల నుంచి
3.5 కిలోల బరువు ఉంటుంది. 2019 వ సంవత్సరంలో ఒక్కో మామిడిపండు బరువు 2.75 కేజీలతో పండింది. ఆ సంవత్సరంలో అత్యధికంగా ఒక్కో పండు ధర సుమారుగా రూ.1200 ధర పలికిందని రైతు శివరాజ్ సింగ్ జాదవ్ తెలిపారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…