వేసవికాలం వచ్చిందంటే చాలు అందరూ ఎంతో ఇష్టంగా తినే పండ్లలో మామిడి పండ్లు ఒకటి. మామిడి పండును పండ్లలో రారాజుగా భావిస్తారు. ఎన్నో పోషక విలువలతో కూడిన ఈ పండ్లను తినడానికి ప్రజలు ఎంతో ఇష్టపడతారు. ఈ క్రమంలోనే మన రాష్ట్రాలలో దొరికే బంగినపల్లి, రసాలు, నీలం వంటి రకాలకు చెందిన మామిడిపండ్లు ఎక్కువగా పండిస్తారు. వీటి ధర కూడా మనకు ఎంతో అందుబాటులోనే ఉంటుంది.కానీ మధ్యప్రదేశ్ కి చెందిన ఓ మామిడి పండు రకము మాత్రం కిలో రూ 1000 పలుకుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
మధ్యప్రదేశ్ అలీరాజ్పూర్ జిల్లాలోని కత్తివాడ ప్రాంతాలో మాత్రమే పండే ‘నూర్జహాన్’ మామిడి పళ్లకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ మామిడి పండ్లు ఒక్కొక్కటి సుమారు కిలోల బరువును కలిగి ఉంటాయి. ప్రస్తుతం ఈ పండు ధర ఏకంగా వెయ్యి రూపాయలు పలుకుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పండు సైజు పెద్దగా ఉండటంతో అత్యధిక ధర పలుకుతోందని రైతులు తెలియజేస్తున్నారు.
ఎంతో రుచికరమైన ఎన్నో పోషకాలు కలిగిన ‘నూర్జహాన్’ మామిడి పండ్ల కోసం ముందుగానే బుకింగ్ చేసుకుంటారని, ఒక్కో పండు సుమారు 2 కిలోల నుంచి
3.5 కిలోల బరువు ఉంటుంది. 2019 వ సంవత్సరంలో ఒక్కో మామిడిపండు బరువు 2.75 కేజీలతో పండింది. ఆ సంవత్సరంలో అత్యధికంగా ఒక్కో పండు ధర సుమారుగా రూ.1200 ధర పలికిందని రైతు శివరాజ్ సింగ్ జాదవ్ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…