సినిమా హీరోలు కేవలం సినిమాల్లోనే కాకుండా బయట కూడా రియల్ హీరోలు అనిపించుకుంటారు. వారిలోని మానవత్వాన్ని బయటపెడతారనడానికి ఉదాహరణగా ఈమధ్యకాలంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా చెప్పవచ్చు. వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ సూపర్ స్టార్ అయిన మహేష్ బాబు ఇంతవరకూ అనేకసామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి అభిమానులందరికీ తెల్సిందే.!
తాజాగా తూర్పు గోదావరి జిల్లా తుమ్మలవరం గ్రామానికి చెందిన కుంచె ప్రదీప్, నాగజ్యోతిల నెల రోజుల బాబుకి గుండెశస్త్ర చికిత్సకు మహేష్ బాబు సహకరించిన విషయం లేటెస్టుగా వెలుగులోకి వచ్చింది. మే 31 సూపర్స్టార్ కృష్ణబర్త్ డే వేడుకల సందర్భంగా బెజవాడలోని ఆంధ్ర ఆస్పత్రిలో ఓ బాబుకు హార్ట్ ఆపరేషన్ చేయించారు ప్రిన్స్ మహేష్ బాబు.
ప్రదీప్, నాగజ్యోతిల దంపతులకు తొలి కాన్పులోనే బాబు పుట్టాడు. మొదట్లో ఆరోగ్యంగా ఉన్నా కాలం గడుస్తున్న కొద్దీ ఆ బాబు శరీరంలో వ్యత్యాసంగా కనబడుతున్న కొన్ని మార్పులను గమనించి అమలాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆ దంపతులిద్దరూ చికిత్స చేయించడం ప్రారంభించారు. బాబును పరీక్షించిన అమలాపురం వైద్యులు ఆ బాబు అరుదైన గుండె జబ్బుతో బాధపడుతున్నట్టుగా నిర్ధారించి వీలైనంత త్వరగా బాబుకు హార్ట్ ఆపరేషన్ చేయాలని సూచించారు. లేదా మెరుగైన వైద్యం కోసం విజయవాడ లేదా హైదరాబాద్ తీసుకెళ్లాల్సి ఉంటుందని, ఖర్చు కూడా కాస్త ఎక్కువగానే వుంటుందని తెలియజేశారు. ఆర్థికంగా వెనుకబడిన ప్రదీప్ అమలాపురంలో తన ఫ్రెండ్ ద్వారా ప్రిన్స్ మహేష్బాబు ట్రస్టు ద్వారా పిల్లలకు ఉచితంగా శస్త్ర చికిత్స చేయిస్తున్నారని తెలుసుకుని విజయవాడలోని ఆంధ్ర ఆస్పత్రి హార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్ వైద్యులను గత నెల 30న సంప్రదించారు.
2 రోజుల తర్వాత అంటే జూన్ 2న వైద్యులు హార్ట్ ఆపరేషన్ చేశారు. అలా హార్ట్ ఆపరేషన్ జరిగిన తర్వాత బాబు ఆరోగ్యం కొంత ఆందోళనాకరంగా మారింది. బీపీ తక్కువగా నమోదు కావడం, గుండె కొట్టుకోవడంలో తేడా ఉండడంతో వైద్యులు I.C.U లో ఉంచి వైద్య ప్రక్రియను పూర్తి చేశారు. 15 రోజుల తర్వాత బాబు కోలుకుని ఆరోగ్యంగా ఉండడంతో ఆ దంపతులను వారి స్వగ్రామానికి పంపించారు. ప్రస్తుతం ఆ బాబు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని ప్రదీప్ తెలియజేశారు. బాబుకి పునర్జన్మనిచ్చిన ప్రిన్స్ మహేష్బాబుకి హృదయపూర్వకంగా తమ కృతజ్ఞతలను తెలియజేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…