Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన సర్కారు వారి పాట సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో బిజీ కావాల్సి ఉండగా మహేష్ బాబు ఇంట్లో వరుస విషాదాలు చోటు చేసుకోవడంతో కొంతకాలం పాటు ఈ సినిమా షూటింగుకు బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
ఇక ఈ సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకోగా రెండవ షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభమైంది అని తెలుస్తుంది. ఈ క్రమంలోనే రెండవ షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా కొన్ని హాస్పిటల్స్ సన్ని వేషాలను కూడా చిత్రీకరించాల్సి ఉండగా చిత్ర బృందం ఈ సన్నివేశాలను హైదరాబాద్లోని యశోద హాస్పిటల్ లో చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఈ షూటింగ్లో మహేష్ బాబు పూజా హెగ్డే పై చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇలా హాస్పిటల్లో షూటింగ్ చిత్రీకరించాల్సిన నేపథ్యంలో మహేష్ బాబు క్యారవాన్ యశోద హాస్పిటల్ ముందు కనిపించింది. దీంతో అభిమానులు కొంతపాటి ఆందోళనకు గురైనప్పటికీ తర్వాత అసలు విషయం తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ఇలా త్రివిక్రమ్ సినిమాలో మరోసారి హాస్పిటల్ సన్నివేశాలను పెట్టడంతో ఈయన గత సినిమా సన్నివేశాలనే పునరావృతం చేస్తున్నారు అంటూ నేటిజెన్లు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా రెండవ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. ఇక త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో దాదాపు 11 సంవత్సరాలు తర్వాత సినిమా రావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు ఖలేజా మంచి విజయాలను అందుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే తో పాటు యంగ్ హీరోయిన్ శ్రీ లీల కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…