Mahesh Babu: టాలీవుడ్ క్యూట్ కపుల్ మహేష్ బాబు, నమ్రతలు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వంశీ సినిమా సమయంలో వయసులో తనకంటే పెద్ద అయిన నమ్రతను పెళ్లి చేసుకున్నాడు మహేష్ బాబు. అయితే వారి పెళ్లికి తండ్రి కృష్ణ ఒప్పుకోకపోవడంతో మహేష్ బాబు సింపుల్ గా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకు దూరంగా ఉంటూ భర్త మహేష్ బాబుకు సంబంధించిన అన్ని పనులను చూసుకుంటోంది. మహేష్ బాబు తో పాటు తన పిల్లలను, అలాగే ఇంటి బాధ్యతలను ఇలా అన్నింటినీ సక్రమంగా నిర్వహిస్తోంది నమ్రత.
మహేష్ కు నమ్రత వెన్నెముక లాంటిది అని కూడా అంటూ ఉంటారు.మరి అలాంటి నమ్రతకు మహేష్ బాబు భయపడతాడట అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని మహేష్ బాబు ఒక షోలో చెప్పడం విశేషం. మహేష్ బాబు బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకె షోలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా ఇటీవలే విడుదల చేశారు షో నిర్వాహకులు. అందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ఫిబ్రవరి 4న ఆహా లో ప్రసారం కానుంది. ఇది ఇలా ఉంటే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ బాబు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
నమ్రత గురించి బాగానే చెప్పావు ఆమె కూడా ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చింది అని బాలయ్య చెప్పగానే.. ఏంటి అంటూ మహేష్ బాబు క్యూరియాసిటీ ప్రదర్శించారు. నమ్రత పేరు చెప్పగానే బాడీలో డిసిప్లేన్ వచ్చింది అని బాలయ్య అనగా.. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి సార్..ఎందుకు ఇవన్నీ గొడవలు అని మహేష్ బాబు సరదాగా అనడంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా నవ్వేశారు. మహేష్ బాబు అన్న మాట పై నెటిజన్స్ మరిన్ని వార్తలు యాడ్ చేస్తూ నమ్రత మహేష్ భయపడతారా? అంటే అవును అంటూ వార్తలను సృష్టిస్తున్నారు.
ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకసారి మహేష్ బాబు పార్కులో వాకింగ్ చేస్తున్న సమయంలో ఎదురుగా పాము కనిపించడంతో దాన్ని చూసిన మహేష్ బాబు భయపడి వెనక్కి 5 కిలోమీటర్లు పరిగెత్తి ఇంటికి వెళ్ళిపోయాడట. అప్పటి నుంచి మళ్లీ కెబిఆర్ పార్క్ కి వెళ్లలేదని చెప్పుకొచ్చాడు మహేష్ బాబు. మీ పిల్లల్లో ఎవరు క్యాట్, ఎవరు బ్రాట్ అని బాలయ్య ప్రశ్నించగా.. గౌతమ్ క్యాట్, సితార బ్రాట్ అని చెప్పుకొచ్చారు మహేష్ బాబు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…