Naga chaithanya:అలా ఇష్టం వచ్చినట్లు రాయడం వల్ల చాలా బాధపడ్డాను అంటున్న నాగ చైతన్య… ఇంకా ఏమన్నారంటే ?
naga chaithanya:తెలుగు ఇండస్ట్రీలో లవ్లీ కపుల్గా చెప్పుకునే నాగచైతన్య – సమంత తమ వైవాహిక బంధానికి స్వస్తి పలికిన విషయం తెలిసిందే. వీరి విడాకుల వ్యవహారం ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉంది. విడాకుల ప్రకటన కి ముందు, తర్వాత కూడా వీరి విడాకుల అంశం గురించే సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. వారు విడిపోవడానికి గల కారణాలను సమంత కానీ , నాగ చైతన్య కానీ తెలుపకపోవడంతో… వారు విడిపోవడానికి కారణలు ఇవే అంటూ ఎవరికి తోచింది వారు అనుకుంటున్నారు. ఈ తరుణంలోనే రీసెంట్గా విడాకులపై స్పందించిన నాగ చైతన్య… ఇద్దరి మంచి కోసం ఈ డెసిషన్ తీసుకున్నామని, దీనివల్ల ఇద్దరం సంతోషం ఉన్నామని తెలిపాడు.
కాగా తాజాగా నాగ చైతన్య మరోసారి విడాకులపై స్పందించాడు. ఇటీవల ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ చైతన్య మాట్లాడుతూ విడాకుల వ్యవహారం గురించి మరోసారి నోరు విప్పాడు. నా గురించి ఏం రాసినా పర్వాలేదు కానీ… నా కుటుంబం రాస్తే నేను బాధపడతాను అని అన్నారు. నాన్న చెప్పినట్లు కుటుంబంలో కానీ, వ్యక్తిగత విషయాల్లో కానీ ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకోవాలి. లేకపోతే పర్వాలేదు కానీ నా కుటుంబం గురించి ఇష్టం వచ్చినట్లు రాయడం నన్ను బాధించింది. అయినా పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అనే విషయాన్ని నేను బలంగా నమ్ముతాను. అందుకే విషయాన్ని మిస్ లీడ్ చేయనంత వరకు నేను స్పందించను అంటూ చైతూ చెప్పుకొచ్చాడు.
ఇక నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే… ఇటీవల లవ్ స్టోరి, బంగార్రాజు చిత్రాలతో సూపర్ హిట్ విజయాలు అందుకున్నాడు ఈ యంగ్ హీరో. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ” బంగార్రాజు ” మంచి కలెక్షన్ లతో దూసుకుపోతుంది. అలానే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న థాంక్యూ సినిమాలో కూడా చైతూ నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య, రాశీఖన్నా జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత చైతన్య ఇంద్రగంటి మోహన్కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…