ఇప్పటికే కరోనా మహమ్మారి దెబ్బతో సినీ ఇండస్ట్రీ కుదేలయింది.. ఇప్పటికే ఎంతోమంది సినీ ప్రముఖులు ఈ కరోనా తాకిడికి బలైపోయారు..ఇక తాజాగా సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది.. తెలుగుతో పాటు కన్నడ, తమిళ భాషల్లో హీరోయిన్గా నటించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మాలాశ్రీ భర్త ప్రముఖ నిర్మాత రాము(52) కరోనాతో కన్నుమూసారు. ఈయన కన్నడలో పలు భారీ చిత్రాలను నిర్మించారు.
ఈయనకు వారం క్రితం కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఈయన బెంగుళూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా ఈయన ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం సాయంత్రం కన్నుమూసారు.ఈయన కర్ణాటకలోని తుముకూరు జిల్లాకు చెందిన వారు. కన్నడ చిత్ర సీమలో పలు భారీ చిత్రాలను ముఖ్యంగా తన భార్య మాలాశ్రీతో పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు.
కన్నడలో ఈయన నిర్మించిన పలు చిత్రాలు తెలుగులో కూడా అనువాదం అయ్యాయి. దాదాపు 40 చిత్రాల వరకు నిర్మించారు. భారీ చిత్రాల నిర్మాతగా పేరు ఉండటంతో ఈయనను అందరు కోటి రాముగా పిలుస్తారు. ఈయన సాయి కుమార్ హీరోగా ఏకే 47, లాకప్ డెత్, కలాసి పాళ్య లాంటి బ్లాక్ బస్టర్స్ సినిమాలను నిర్మించారు. ఈయన హీరోయిన్ మాలాశ్రీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ఈయన అకాల మరణంతో కన్నడ చిత్ర సీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈయన మృతిపై కన్నడతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈయన అంత్యక్రియలు బెంగుళూరులో ఈ రోజు జరగనున్నాయి.2020 లాగా 2021 చిత్ర సీమకు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ఈ యేడాది ఇప్పటికే నటుడు వివేక్, పొట్టి వీరయ్య వంటి ప్రముఖ నటులు కన్నుముసారు..అది జరిగి మరువక ముందే ఇప్పుడు మరో విషాదం జరగడం బాధాకరమైన విషయమనే చెప్పాలి…!!
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…