ఇప్పటికే కరోనా మహమ్మారి దెబ్బతో సినీ ఇండస్ట్రీ కుదేలయింది.. ఇప్పటికే ఎంతోమంది సినీ ప్రముఖులు ఈ కరోనా తాకిడికి బలైపోయారు..ఇక తాజాగా సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది.. తెలుగుతో పాటు కన్నడ, తమిళ భాషల్లో హీరోయిన్గా నటించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మాలాశ్రీ భర్త ప్రముఖ నిర్మాత రాము(52) కరోనాతో కన్నుమూసారు. ఈయన కన్నడలో పలు భారీ చిత్రాలను నిర్మించారు.
ఈయనకు వారం క్రితం కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఈయన బెంగుళూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా ఈయన ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం సాయంత్రం కన్నుమూసారు.ఈయన కర్ణాటకలోని తుముకూరు జిల్లాకు చెందిన వారు. కన్నడ చిత్ర సీమలో పలు భారీ చిత్రాలను ముఖ్యంగా తన భార్య మాలాశ్రీతో పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు.
కన్నడలో ఈయన నిర్మించిన పలు చిత్రాలు తెలుగులో కూడా అనువాదం అయ్యాయి. దాదాపు 40 చిత్రాల వరకు నిర్మించారు. భారీ చిత్రాల నిర్మాతగా పేరు ఉండటంతో ఈయనను అందరు కోటి రాముగా పిలుస్తారు. ఈయన సాయి కుమార్ హీరోగా ఏకే 47, లాకప్ డెత్, కలాసి పాళ్య లాంటి బ్లాక్ బస్టర్స్ సినిమాలను నిర్మించారు. ఈయన హీరోయిన్ మాలాశ్రీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ఈయన అకాల మరణంతో కన్నడ చిత్ర సీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈయన మృతిపై కన్నడతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈయన అంత్యక్రియలు బెంగుళూరులో ఈ రోజు జరగనున్నాయి.2020 లాగా 2021 చిత్ర సీమకు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ఈ యేడాది ఇప్పటికే నటుడు వివేక్, పొట్టి వీరయ్య వంటి ప్రముఖ నటులు కన్నుముసారు..అది జరిగి మరువక ముందే ఇప్పుడు మరో విషాదం జరగడం బాధాకరమైన విషయమనే చెప్పాలి…!!
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…
కర్నూలు జిల్లా ఆదోనిలో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుటుంబ సమస్యతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు…