Featured

మానవత్వానికి మచ్చ తెచ్చే ఘటన.. తోపుడుబండిపై కరోనా మృతదేహం తరలింపు?

దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి మానవత్వాన్ని చంపేస్తోంది. తోటివారికి సహాయపడాలనే గుణాన్ని మనుషుల నుంచి దూరం చేస్తోంది. సొంత బంధువులైనా, స్నేహితులైనా కరోనా సోకిందంటే వారిని దూరం పెడుతున్నారు. కరోనా నుంచి కోలుకోలేక మృతి చెందితే వారి దహన సంస్కారాలకు వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదు. వైద్యులు, శాస్త్రవేత్తలు చనిపోయిన వారిలో వైరస్ ఉండదని చెబుతున్నా ప్రజల ఆలోచనా తీరులో మార్పు రావడం లేదు.

తాజాగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వ్యక్తిని అతని కుటుంబ సభ్యులు తోపుడు బండిపై తరలించి అంత్యక్రియలు చేశారు. సోషల్ మీడియాలో ఈ ఘటన తెగ వైరల్ అవుతోంది. మహారాష్ట్ర రాష్ట్రంలో పూణెలోని ఖానాపూర్‌కు చెందిన యువకుడికి కొన్ని రోజుల క్రితం కరోనా వైరస్ నిర్ధారణ అయింది. కొన్ని రోజులు హోం క్వారంటైన్ లో ఉన్న యువకుడికి శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడ్డాయి.

సమస్య తీవ్రం కావడంతో బాధితుని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే యువకుడు వెళ్లిన ఆస్పత్రిలో బెడ్ల కొరత తీవ్రంగా ఉంది. ఆస్పత్రిలో సరిగ్గా సౌకర్యాలు లేవనే కారణంతో యువకుడు ఆస్పత్రి సిబ్బందికి సమాచారం ఇవ్వకుండానే ఇంటికి వెళ్లిపోయాడు. అయితే యువకుడికి క్రమంగా ఆరోగ్యం క్షీణించి శుక్రవారం రోజున మృతి చెందాడు. ఇంట్లో మృతి చెందడం… బాధితుడి కుటుంబ సభ్యులు పేదవాళ్లు కావడంతో మృతదేహాన్ని ఎలా తరలించాలో వాళ్లకు అర్థం కాలేదు.

దీంతో బాధితుని కుటుంబ సభ్యులు ఆంబులెన్స్ కావాలని ఫోన్ చేశారు. కానీ ఆంబులెన్స్ సిబ్బంది నుంచి సరైన స్పందన వ్యక్తం కాలేదు. ఏం చేయాలో పాలుపోని కుటుంబ సభ్యులు తోపుడు బండి సహకారంతో మృతదేహాన్ని తరలించారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తోపుడు బండిపై మృతదేహాన్ని తరలించాల్సి వచ్చిందని వాళ్లు పేర్కొన్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఎన్టీఆర్ మాట వినని హీరోయిన్.. సినిమా నుంచే తప్పుకున్న సావిత్రి

తెలుగు సినీ చరిత్రలో అగ్ర హీరోగా నిలిచిన ఎన్టీఆర్ అనేక మంది ప్రముఖ హీరోయిన్‌లతో కలిసి ఎన్నో విజయవంతమైన సినిమాలు…

3 minutes ago

పెళ్లి, సంతానం కోసం భక్తులు క్యూలు.. ఆంధ్రలోని ఈ బావి రహస్యం ఏమిటి?

ఆంధ్రప్రదేశ్‌లోని పలు ఆలయాలు తమ ప్రత్యేక విశిష్టతలతో భక్తులను ఆకట్టుకుంటూ ఉంటాయి. వాటిలో కొన్నింటికి పురాణ గాథలు, మరికొన్నింటికి ఆశ్చర్యకరమైన…

4 minutes ago

ఎండలో అలసటకు ఒక్క గ్లాస్ చాలు.. చెరుకు రసం లేదా కొబ్బరి నీళ్లు?

వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీరసం తగ్గించుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరంగా మారింది. ఈ…

36 minutes ago

బ్రహ్మ ముహూర్తం అలవాటు పెంచుకుంటే మీలో ఈ మార్పులు ఖాయం!

మన జీవితంలో చిన్న చిన్న అలవాట్లు పెద్ద మార్పులకు దారి తీస్తాయి. అలాంటి వాటిలో ఉదయం వేళ లేవడం ఒక…

41 minutes ago

ఫేస్ ఇన్‌ఫ్లమేషన్ అలర్ట్: అందం తగ్గించే ముఖ వాపు… సులభంగా తగ్గించే చిట్కాలు ఇవే!

ముఖం ఎప్పుడూ ఫ్రెష్‌గా, కాంతివంతంగా కనిపించడం ప్రతి ఒక్కరికీ ఇష్టం. అయితే కొన్నిసార్లు కారణం తెలియకుండానే ముఖం ఉబ్బినట్లు, ఎర్రబడినట్లు…

47 minutes ago

భారత్ చింతపండు దుమ్మురేపుతోంది… ప్రపంచ మార్కెట్‌లో టాప్ ప్లేస్!

భారతీయ వంటింట్లో చింతపండు లేకుండా చాలా వంటలు పూర్తవవు. పులుపు రుచిని ఇచ్చే ఈ సహజ పదార్థం కేవలం రుచికే…

52 minutes ago