Manchu Lakshmi: మంచు లక్ష్మీ.. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కుమార్తె. ఆమె పలు రకాలుగా తన ప్రతిభను చాటుకుంటూ.. చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నటిగా, నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్గా, యూట్యూబర్గా ఇలా ఎన్నో రకాలుగా తన టాలెంట్తో ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.
కేవలం సినిమాల ద్వారానే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులను అలరిస్తుంది ఈ విలక్షణ నటి. ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో ఫన్నీ వీడియోలు, ఫొటోలను షేర్ చేస్తూ ఫుల్ ఎంటర్టైన్మెంట్ను అందిస్తుంది. ప్రస్తుతం ఆమె మళయాళంలో మోహన్ లాల్ సరసన నటిస్తోంది. ‘మాన్ స్టర్’ అనే మూవీలో మంచు లక్ష్మి నటిస్తోంది.
దీనిలో ఆమెది కీలక పాత్ర అని తెలుస్తోంది. దాని కోసమే ఆమె కేరళకు చెందిన అతి పురాతన యుద్ధకళ కలరియపట్టును ప్రాక్టీస్ చేయడంలో బిజీ అయిపోయింది. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి.
ఇక ఇన్ని రోజులు ఫ్యామిలీతో గడిపానని.. ఇక నా కోసం కొంత సమయం కేటాయించుకునేందుకు వెళ్తున్నాను అని చెప్పింది. ఆమె ఎక్కడకు వెళ్తుందనే వివరాలను మాత్రం తెలియజేయలేదు. ఎయిర్ పోర్టు లాంజ్ లో ఎదురు చేస్తున్నఆమె.. ఆకలి వేయకపోయినా అక్కడ కొన్ని పదర్థాలను తినేసిందట. దానికి కారణం ఏంటంటే.. ఆ ఫ్లైట్ టికెట్ కొనేందుకు తన కిడ్నీలు అమ్ముకునేంత పరిస్థితి వచ్చిందంట. ఆ టికెట్ డబ్బులకు న్యాయం చేసేందుకు అలా ఆకలి కాకపోయినా తింటున్నా అని ఆమె ట్వీట్ చేసింది. దీంతో నెటిజన్లు వివిధ రకాలుగా స్పందించారు. అక్క నువ్వు కూడా మా కులమే అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. అవును మా డాడీ రిచ్ గానీ.. నేను కాదు అంటూ మంచు లక్ష్మీ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…
తెలుగు బుల్లితెరపై విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రీతి నిగమ్ తాజాగా తన జీవితంలో ఎదురైన కొన్ని…
హిందూ పురాణాల్లో శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకటైన పరశురాముడు ప్రత్యేకమైన స్థానం పొందాడు. శౌర్యం, ధర్మ పరిరక్షణ, అన్యాయానికి వ్యతిరేకంగా…
సినీ నటి, రాజకీయ నాయకురాలిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన రోజా మళ్లీ బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. కొంతకాలం విరామం…
ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా దాఖలు చేసిన పిటిషన్పై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ‘పవర్ సోప్స్’…
ఇప్పటివరకు గర్భనిరోధక బాధ్యత ఎక్కువగా మహిళలపైనే ఉండేది. మాత్రలు, ఇతర పద్ధతులు ఎక్కువగా మహిళలకే పరిమితమయ్యాయి. అయితే వైద్యరంగంలో తాజా…