Manchu Lakshmi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ఉన్నటువంటి ఆదరణ గురించి మనకు తెలిసిందే. మంచు మోహన్ బాబు నటుడిగా నిర్మాతగా ఒక విద్యావేత్తగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మోహన్ బాబు వారసులుగా విష్ణు మనోజ్ లక్ష్మీ ప్రసన్న ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
ఇలా ఈ ముగ్గురు కూడా ఇండస్ట్రీలో సినిమాలలో నటిస్తూ సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు.ఇకపోతే మంచో ఫ్యామిలీ ఏ చిన్న విషయం సోషల్ మీడియా వేదికగా అయినా లేదా మీడియా సమావేశంలో అయినా మాట్లాడిన ఈ ఫ్యామిలీ గురించి పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ రావడం జరుగుతుంది.ఇలా ట్రోలింగ్స్ గురించి మంచు ఫ్యామిలీ ఇది వరకు ఎన్నోసార్లు సీరియస్ అయినప్పటికీ వారి గురించి ఏమాత్రం ట్రోల్స్ తగ్గలేదు.
ఇకపోతే గత కొద్ది రోజులుగా మంచు వారసుల మధ్య విభేదాలు వచ్చాయని అందుకే వీరందరూ కూడా విడివిడిగా ఉంటున్నారు అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో ఈ వార్తలు పై తాజాగా మంచు లక్ష్మి స్పందిస్తూ అసలు విషయం తెలియచేశారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మీ మాట్లాడుతూ మేమందరం ఎప్పటికీ కలిసే ఉన్నాం అని సమాధానం చెప్పారు.
మేము కలిసి ఉండడం దూరంగా ఉండడం అనేది మా పర్సనల్ విషయాలు అంటూ ఈమె ఆగ్రహం వ్యక్తం చేశారు. విష్ణు ప్రస్తుతం తన ఫ్యామిలీ బిజినెస్ లు చూసుకుంటూ బిజీగా గడుపుతున్నారు. అందుకే వాడు ఎక్కడికి బయటకు రాడు.ఇక సమయం దొరికినప్పుడు నేను మనోజ్ ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తుంటాము. అందుకే విష్ణు మాకు దూరంగా ఉండటం వల్లే ఇలాంటి వార్తలు వచ్చాయని అంతకుమించి తమ ఫ్యామిలీలో ఎలాంటి విభేదాలు లేవు అంటూ లక్ష్మీ ప్రసన్న చెప్పుకొచ్చారు
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…