Manchu Manoj: మెగా బ్రదర్ నాగబాబు పై పరోక్షంగా సెటైర్లు వేసిన మంచు మనోజ్…!
Manchu Manoj:మంచు వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు చిత్రాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు మంచు మనోజ్ గత కొంత కాలం నుంచి ఇండస్ట్రీకు దూరంగా ఉంటున్నారు. ఇకపోతే తాజాగా మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా మంచు మనోజ్ మాట్లాడుతూ పరోక్షంగా మెగాబ్రదర్ నాగబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక ఈ రెండు కుటుంబాల మధ్య పరస్పర అభిప్రాయ బేధాలు ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోని ఇరు కుటుంబాల మధ్య ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తున్నారు.ఇకపోతే ఈ పుట్టినరోజు సందర్భంగా మంచు మనోజ్ ఈ వేదికపై మాట్లాడిన పరోక్షంగా నాగ బాబు పై సెటైర్లు వేశారు.
మా ఎన్నికల గురించి మాట్లాడుతూ మా కుటుంబానికి మద్దతు తెలిపిన వారి పట్ల మరొక వ్యక్తి చాలా దారుణంగా మాట్లాడారని అయినా వాటి గురించి మేము ఏమాత్రం పట్టించుకోలేదని తెలిపారు. ఇదే విషయాన్ని నాన్న దగ్గర ప్రస్తావిస్తే వాళ్లకు హయ్యర్ పర్పస్ లేదు వదిలేయ్ అని అన్నారు. అది కూడా నిజమే కదా వాళ్లకు ఎలాంటి హయ్యర్ పర్పస్ లేదు అంటూ మాట్లాడారు.
అయితే ఆ వ్యక్తి ఫ్యామిలీలో ఎంతో మంచి వాళ్ళు ఉన్నారు. జనాల కోసం ఏదో ఒకటి చేయాలనే తపన కలిగిన వారు ఉన్నారు. అదేవిధంగా హయ్యర్ పర్పస్ కోసం జీవించే వాళ్లు కూడా ఉన్నారు. కానీ ఆ వ్యక్తి మాత్రం ఏమీ లేకుండా ఉండిపోయారని మంచు మనోజ్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంచు మనోజ్ కచ్చితంగా మెగాబ్రదర్ నాగబాబు గురించి ఈ వ్యాఖ్యలు చేశారని అర్థమవుతోంది. మరి ఈ వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…