Manchu Manoj -Mounika: ప్రభాస్ నటించిన ఆది
పురుష్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జూన్ 16 వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. రామాయణం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదలకు ముందే పలువురు హీరోలు పెద్ద ఎత్తున టికెట్లను కొనుగోలు చేసిన సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే భూమా మౌనిక మనోజ్ దంపతులు కూడా అనాధ పిల్లల కోసం ఏకంగా 2500 టికెట్లను కొనుగోలు చేశారు.రామాయణం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూడాలని ముఖ్యంగా చిన్నపిల్లలు రామాయణం గొప్పతనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న ఉద్దేశంతోనే ఇలా అనాధల కోసం టికెట్లు కొనుగోలు చేసినట్టు ఈయన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
ఈ విధంగా అనాధ పిల్లల కోసం టికెట్లను కొనుగోలు చేయడమే కాకుండా మొదటి రోజు సినిమా విడుదలైన తరువాత అనాధ పిల్లలతో కలిసి భూమా మౌనిక మనోజ్ దంపతులు ఈ సినిమాని చూశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నిజంగానే మనోజ్ మౌనిక దంపతులు చాలా గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక మనోజ్ ఈ మధ్యకాలంలో ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్న విషయం మనకు తెలిసిందే. గత కొద్దిరోజుల క్రితం ఈయన తన పుట్టినరోజు వేడుకలను కూడా అనాధాశ్రమంలోనే జరుపుకున్నారు. అక్కడ పిల్లల సమక్షంలో కేక్ కట్ చేయడమే కాకుండా వారికి బుక్స్, బ్యాగ్ వంటి అవసరమైన వస్తువులను పంపిణీ చేసి మంచి మనసు చాటుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…