Movie News

Manchu Vishnu: ఆది పురుష్ టీజర్ ఎంతో నిరాశపరిచింది.. మోసం చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది: మంచు విష్ణు

Manchu Vishnu: బాహుబలి సినిమా తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు నటుడు ప్రభాస్. ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం రాధేశ్యామ్.ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిలో రామాయణం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఆది పురుష్.

ఈ సినిమా వచ్చేయడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. అయితే ఈ టీజర్ పై ఎంతోమంది సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు స్పందిస్తూ విమర్శలు కురిపించారు.రామాయణం అంటే ఒక అద్భుతమైన మహాకావ్యంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో రాముడు, హనుమంతుడు రావణాసురుడి లుక్ పూర్తిగా మార్చేసారంటూ ఎంతోమంది అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇకపోతే ఈ సినిమా టీజర్ పై తాజాగా మా అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు స్పందించారు. ఈయన నటించిన జిన్నా సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో మీడియా సమావేశంలో భాగంగా మాట్లాడినటువంటి మంచు విష్ణు ఈ సినిమా టీజర్ తనని ఎంతో నిరాశపరిచిందని తెలిపారు.రామాయణం సినిమాని లైవ్ సినిమాగా చూపిస్తారనుకుంటే యానిమేషన్ చిత్రంగా చూపిస్తున్నారని,ఈ సినిమా టీజర్ చూస్తుంటే అచ్చం రజినీకాంత్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుందని తెలిపారు.

Manchu Vishnu: యానిమేషన్ సినిమా చూపిస్తున్నారు..

ఇక ఈ సినిమా టీజర్ విడుదలకు ముందే ఇది ఒక యానిమేషన్ సినిమా అని చెప్పి ఉంటే టీజర్ పై ఈ స్థాయిలో విమర్శలు వచ్చేది కాదని ప్రేక్షకులను మోసం చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది అంటూ విష్ణు ఈ సినిమా టీజర్ పై తీవ్ర స్థాయిలో నిరాశ వ్యక్తం చేశారు. ఇక ఈ టీజర్ విషయం పై విమర్శలు ముగిశాయి అనుకునే లోపు మరోసారి విష్ణు టీజర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం విష్ణు చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

6 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

7 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

14 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

15 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

15 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

1 day ago