Movie News

Manchu Vishnu: ఆది పురుష్ టీజర్ ఎంతో నిరాశపరిచింది.. మోసం చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది: మంచు విష్ణు

Manchu Vishnu: బాహుబలి సినిమా తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు నటుడు ప్రభాస్. ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం రాధేశ్యామ్.ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిలో రామాయణం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఆది పురుష్.

ఈ సినిమా వచ్చేయడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. అయితే ఈ టీజర్ పై ఎంతోమంది సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు స్పందిస్తూ విమర్శలు కురిపించారు.రామాయణం అంటే ఒక అద్భుతమైన మహాకావ్యంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో రాముడు, హనుమంతుడు రావణాసురుడి లుక్ పూర్తిగా మార్చేసారంటూ ఎంతోమంది అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇకపోతే ఈ సినిమా టీజర్ పై తాజాగా మా అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు స్పందించారు. ఈయన నటించిన జిన్నా సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో మీడియా సమావేశంలో భాగంగా మాట్లాడినటువంటి మంచు విష్ణు ఈ సినిమా టీజర్ తనని ఎంతో నిరాశపరిచిందని తెలిపారు.రామాయణం సినిమాని లైవ్ సినిమాగా చూపిస్తారనుకుంటే యానిమేషన్ చిత్రంగా చూపిస్తున్నారని,ఈ సినిమా టీజర్ చూస్తుంటే అచ్చం రజినీకాంత్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుందని తెలిపారు.

Manchu Vishnu: యానిమేషన్ సినిమా చూపిస్తున్నారు..

ఇక ఈ సినిమా టీజర్ విడుదలకు ముందే ఇది ఒక యానిమేషన్ సినిమా అని చెప్పి ఉంటే టీజర్ పై ఈ స్థాయిలో విమర్శలు వచ్చేది కాదని ప్రేక్షకులను మోసం చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది అంటూ విష్ణు ఈ సినిమా టీజర్ పై తీవ్ర స్థాయిలో నిరాశ వ్యక్తం చేశారు. ఇక ఈ టీజర్ విషయం పై విమర్శలు ముగిశాయి అనుకునే లోపు మరోసారి విష్ణు టీజర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం విష్ణు చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago