Manchu vishnu: వెండితెర నటుడిగా మా అధ్యక్షుడిగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు మంచు విష్ణు. ఈ మధ్యకాలంలో మంచు విష్ణు తరచు ఏదో ఒక విషయం ద్వారా వివాదాలలో నిలుస్తూ ఉంటారు. అయితే ఇలా తరచు వార్తల్లో ఉండే ఈయన తాజాగా బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేశారు. జీ తెలుగులో ప్రసారమవుతున్న డాన్స్ ఇండియా డాన్స్ కార్యక్రమంలో భాగంగా విష్ణు ఈ కార్యక్రమంలో సందడి చేశారు.
ఇక ఈ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరిస్తున్నటువంటి అకుల్ బాలాజీ మంచు విష్ణుని వేదికపైకి ఆహ్వానిస్తూ అన్నొచ్చిండు అంటూ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్లే చేశారు. సాధారణంగా బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉండే మంచు విష్ణు తన సినిమా జిన్నా విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిమిత్తం బుల్లితెర కార్యక్రమంలో సందడి చేశారు.
ఇక ఈ కార్యక్రమానికి మంచు విష్ణు రావడంతోనే కంటెస్టెంట్ రోహిణి వెళ్లి విష్ణుతో కలిసి ఫన్ క్రియేట్ చేశారు. ఈ క్రమంలోనే రోహిణి మాట్లాడుతూ తన పెళ్లికి మీ టెంట్ హౌస్ నుంచి అన్నీ రావాలని అడుగుతుంది రోహిణి ఇలా అడిగేసరికి వెంటనే విష్ణు స్పందిస్తూ నా టెంట్ హౌస్ చేస్తే పెళ్లిళ్లు ఆగిపోతాయంటూ షాక్ ఇవ్వడమే కాకుండా నాకన్నా అందగాళ్ళు చాలామంది ఉన్నారంటూ తనపై పంచ్ వేశారు.
ఇక ఈ డాన్స్ షోలో భాగంగా ఓ పెర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత చీర ప్రాముఖ్యత చెప్పమని అడగగా విష్ణు ఈ విషయం గురించి మాట్లాడుతూ ఇలా పబ్లిక్ లో చీర గురించి చెప్పమని అడిగితే ఏం చెప్పాలి నేను నా ఫాంటసీతో చెప్పానంటే అందుకు సెన్సార్ ఒప్పుకోదు అంటూ ఈయన పన్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…