అప్పుడప్పుడు బాత్ రూమ్ లో కొంతమంది గుండెపోటు వచ్చి చనిపోతున్న వార్తలు ఇటీవల వింటున్నాం. బాత్ రూమ్లో స్నానం చేస్తున్న సమయంలోనో లేక మల విసర్జన చేస్తున్న సమయంలోనో హార్ట్ ఎటాక్ వస్తుంది. అసలు బాత్ రూమ్ లో గుండెపోట్లు ఎక్కువగా ఎందుకొస్తాయి. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ పెద్దగా అవగాహన ఉండదు. ఆ పరిస్థితిని నివారించే అవకాశముందా.. గుండెపోటు మీద పరిశోధన చేస్తున్న NCBI మార్కెటింగ్ ఏజెన్సీ రిపోర్ట్ ప్రకారం.. 10 నుంచి 11 శాతం వరకు బాత్రూంలోనే ఎక్కువగా హార్ట్ ఎటాక్ లు బాత్ రూమ్లో ఉన్న సమయంలోనే సంభవిస్తుంటాయని వెల్లడించింది.
శరీర, రక్తపు ఉష్ణోగ్రతలకు గుండెపోటుకు దగ్గర సంబంధముంది. హృద్రోగ వైద్య నిపుణులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. హార్ట్ ఎటాక్కు ప్రధాన కారణం నీటి ఉష్ణోగ్రతలే. చలికాలంలో చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే స్నానం చేసేటపుడు ఓ చిన్న జాగ్రత్త పాటిస్తే గుండెపోటు నుంచి తప్పించుకోవచ్చు.
నీళ్లు మొదట ఎట్టి పరిస్థితుల్లో తలమీద పోసుకోకూడదు. తలమీద నీళ్లు మొదట పోసుకోవడం వల్ల శరీరం హఠాత్తుగా ఉష్ణోగ్రతల్లో మార్పు చోటుచుసుకుంటుది. ఆ మార్పుకి శరీరం తట్టుకోలేదు. తలమీద చన్నీళ్ళు పడగానే వేడి నెత్తురు ఒక్కసారిగా పైకి అంటే తలభాగంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది.దీంతో రక్తనాళాల మీద ఒత్తిడి పెరిగి గుండె లేదా మెదడు స్ట్రోక్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. తల, పాదాలు మినహా మిగతా శరీర భాగాలను ముందు నీళ్లతో తడుపుకోవాలి. చివరగా తల మీద నీళ్లు పోసుకోవాలి. ఇలా చేస్తే గుండెపోటు నుంచి తప్పించుకోవచ్చు.
మలబద్దకం ఉన్న వారికి కూడా గుండె పోటు వచ్చే అవకాశం ఉంటుంది. మల విసర్జన కోసం కష్టపడుతున్న నేపథ్యంలో గుండెపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. దీంతో గుండె పోటు వచ్చే అవకాశం ఉంటుంది. బాత్రూంకి వెళ్లినప్పుడు ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకూడదు. ఒత్తిళ్లు కూడా బాత్ రూమ్లో హార్ట్ ఎటాక్ రావడానికి మరో ప్రధాన కారణం అని హెల్త్ టైన్ డాట్ కామ్ పేర్కొంది. ముఖ్యంగా బీపీ, కొలెస్ట్రాల్, గుండె సమస్యలు, మెగ్రైన్ ఉన్న వారికి పైన చెప్పిన చిట్కా పాటిస్తే ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది
ఆంధ్రప్రదేశ్లో మరోసారి సోషల్ మీడియా కేంద్రంగా కొత్త వివాదం చెలరేగింది. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ ‘లడ్డూ ప్రసాదం’ పేరుతో ఐస్క్రీమ్ను…
ఆంధ్రప్రదేశ్లో మరోసారి సోషల్ మీడియా కేంద్రంగా కొత్త వివాదం చెలరేగింది. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ ‘లడ్డూ ప్రసాదం’ పేరుతో ఐస్క్రీమ్ను…
మనిషి జీవితం ఎలా ఉండాలి? ఏ పనులు మంచివి, ఏవి దూరంగా ఉండాలి? అనే విషయాలను పురాణాలు స్పష్టంగా చెబుతాయి.…
మధ్యతరగతి ఉద్యోగులకు పెద్ద ఊరట కలిగించే మార్పులు రాబోతున్నాయనే చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి…
హరిహరసుతుడు అయ్యప్ప స్వామి జయంతి సందర్భంగా కేరళలోని శబరిమల ఆలయం ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రత్యేక ఉత్సాహంతో మారుమ్రోగుతోంది. సంవత్సరంలో కొన్ని…
మన రోజువారీ జీవితంలో చాలామందికి తేన్పులు రావడం సహజమే. కానీ కొందరిలో ఇవి ఎక్కువగా రావడం వల్ల అసౌకర్యంగా మారుతుంది.…