Actress Meena: ఆందోళనలో మీనా అభిమానులు.. కొత్త సంవత్సరంలో బ్యాడ్ న్యూస్ చెప్పిన మీనా..!
Actress Meena: బాల నటిగా గుర్తింపు తెచ్చుకుని… అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన మీనా గురించి ప్రత్యేకంగా పరియచం అవసరం లేదు. తెలుగు, తమిళం, కన్నడ, మళయాళ భాషల్లో తన నటన, అందం ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. చిరంజీవి, రజినీకాంత్, కమల్ హాసన్, మోహన్ లాల్ , మమ్ముట్టి వంటి స్టార్ హీరోలతో వర్క్ చేసింది.
తెలుగులో దాదాపు అందరు అగ్రహీరోలతో కలిసి నటించింది. ప్రస్తుతం టీవీ షోలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లో కనిపిస్తోంది. ఇటీవల మళయాళంలో మోహల్ లాల్ సరసన, తెలుగులో వెంకటేశ్ పక్కన దృశ్యం2 మూవీలో యాక్ట్ చేసింది.
ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఓ విషయం మీనా ఫ్యాన్స్ కు ఆందోళన కలిగిస్తోంది. 2022 కొత్త సంవత్సరంలో అనుకోని అతిథి మీనా ఇంట్లోకి వచ్చింది. అయితే ఈ అతిథి ఎవరో కాదు కరోనా అని చెప్పింది. ఈ మాటతో ఇటు ప్రేక్షకులతో పాటు ఆమె ఫ్యాన్స్ లో ఆందోళన నెలకొంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మీనా.. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ఫన్నీగా చేసిన ఈ ట్విట్ చాలా వైరల్ అవుతోంది. మీనా ట్విట్టర్ లో ‘‘ ‘2022లో మా ఇంటికి వచ్చిన తొలి అతిథి మిస్టర్ కరోనా. మా కుటుంబం మొత్తాన్ని ఇష్ట పడింది. కానీ, నేను దానికి మా ఇంట్లో చోటు ఇవ్వను. ప్రజలారా జాగ్రత్తగా ఉండండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. బాధ్యతగా మసులుకోండి. కరోనా వ్యాప్తికి అవకాశం ఇవ్వకండి. మీ ప్రార్థనల్లో మాకు కూడా చోటివ్వండి’ అంటూ వ్యాఖ్యానించింది. దీనికి ప్రతిగా కొంత మంది త్వరగా కోలుకోవాలి మేడమ్ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…